రాష్ట్రంలో జీవో వన్ను సమర్ధంగా అమలు చేయాలని పోలీసుల అధికారుల్ని ఆదేశించారు సీఎం జగన్. రోడ్లపై సమావేశాలను నియంత్రించేలా ప్రభుత్వం తెచ్చిన ఈ జీవోనూ కచ్చితంగా అమలు చేయాలన్నారు. తద్వారా మనుషులు చనిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవాలంటూ పోలీసుల్ని ఆదేశించారు. హోంశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రివ్యూ చేశారు సీఎం జగన్. సైబర్ నేరాల నియంత్రణ, దిశ యాప్ ద్వారా మహిళల భద్రత, గంజాయి సాగు నియంత్రణకు పోలీసుశాఖ చేపట్టిన చర్యలపై సమీక్షించారు. ఇక.. ‘స్పందన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు.