AP: ఏపీలో రూ. లక్ష కోట్ల పెట్టబడులకు ఆమోదం

12వ పెట్టుబడుల ప్రోత్సహక మండలి భేటీ.. కీలక ప్రతిపాదనలకు మండలి ఆమోదముద్ర.. 3 మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్‌ జోన్ల.. 85 వేలకుపైగా ఉద్యోగాల కల్పన

Update: 2025-11-08 04:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు భా­రీ­గా పె­ట్టు­బ­డు­లు వస్తు­న్నా­యి. ఈ క్ర­మం­లో రూ.1 లక్ష కో­ట్ల­కు పైగా పె­ట్టు­బ­డు­ల­కు రా­ష్ట్ర పె­ట్టు­బ­డుల ప్రో­త్సా­హక మం­డ­లి ఆమో­దం తె­లి­పిం­ది. ఈ పె­ట్టు­బ­డుల ద్వా­రా 85,870 మం­ది­కి ఉద్యోగ అవ­కా­శా­లు లభిం­చ­ను­న్నా­యి. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన శు­క్ర­వా­రం 12వ ఎస్‌­ఐ­పీ­బీ సమా­వే­శ­మైం­ది. ఈ సం­ద­ర్భం­గా చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ.. రా­ష్ట్రం­లో క్ల­స్ట­ర్‌ వా­రీ­గా పా­రి­శ్రా­మి­కా­భి­వృ­ద్ధి చే­ప­డ­తా­మ­ని తె­లి­పా­రు. మూడు మెగా సి­టీ­లు, 15 ఇం­డ­స్ట్రి­య­ల్‌ జో­న్ల­ను అభి­వృ­ద్ధి చే­స్తా­మ­న్నా­రు. పె­ట్టు­బ­డుల సద­స్సు కంటే ముం­దే వి­విధ పరి­శ్ర­మ­ల­కు శం­కు­స్థా­పన చే­స్తా­మ­న్నా­రు. వీటి వల్ల 85 వే­ల­కు పైగా ఉద్యో­గా­లు రా­ను­న్న­ట్లు తె­లి­పిం­ది. మూడు మెగా సి­టీ­లు, 15 పా­రి­శ్రా­మిక జో­న్ల అభి­వృ­ద్ధి­కి శ్రీ­కా­రం చు­ట్ట­ను­న్న­ట్లు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. పె­ట్టు­బ­డుల సద­స్సు ముం­దే శం­కు­స్థా­ప­న­లు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. కాగా, అధి­కా­రు­లు బా­ధ్య­త­గా వ్య­వ­హ­రిం­చా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­రు. రా­ష్ట్రం­లో క్ల­స్ట­ర్‌ వా­రీ­గా పా­రి­శ్రా­మి­కా­భి­వృ­ద్ధి చే­ప­డ­తా­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అన్నా­రు.

సీఎం అధ్యక్షతన భేటీ

ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన జరి­గిన ఈ సమా­వే­శా­ని­కి మం­త్రు­లు నారా లో­కే­ష్, కె. అచ్చె­న్నా­యు­డు, టి జి భరత్, పి.నా­రా­యణ, వా­సం­శె­ట్టి సు­భా­ష్, బీసీ జనా­ర్థ­న్ రె­డ్డి, గొ­ట్టి­పా­టి రవి­కు­మా­ర్, అన­గా­ని సత్య­ప్ర­సా­ద్, రా­ష్ట్ర ప్ర­భు­త్వ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి కె వి­జ­యా­నం­ద్, ఉన్న­తా­ధి­కా­రు­లు హా­జ­ర­య్యా­రు. ఈ పె­ట్టు­బ­డుల ప్ర­తి­పా­ద­న­ల­ను ఆమో­దిం­చ­డ­మే కా­కుం­డా.. అవి క్షే­త్ర­స్థా­యి­లో కా­ర్య­రూ­పం దా­ల్చే­లా అధి­కా­రు­లు బా­ధ్యత తీ­సు­కో­వా­ల­ని ఆదే­శిం­చా­రు. పె­ట్టు­బ­డి­దా­రు­ల­కు భూమి, వి­ద్యు­త్ వంటి వస­తుల కల్ప­న­లో ఎలాం­టి జా­ప్యం లే­కుం­డా చూ­డా­ల­ని, ఫి­ర్యా­దు­ల­కు ఆస్కా­రం ఇవ్వొ­ద్ద­ని సూ­చిం­చా­రు. గత ప్ర­భు­త్వ హయాం­లో భూ కే­టా­యిం­పు­లు పొం­ది కూడా పను­లు ప్రా­రం­భిం­చ­ని ప్రా­జె­క్టు­ల­ను సమీ­క్షిం­చి.. పు­రో­గ­తి లే­క­పో­తే అను­మ­తు­లు రద్దు చే­యా­ల­ని ఆదే­శా­లు జారీ చే­శా­రు. ఈ నెల 14, 15 తే­దీ­ల్లో వి­శా­ఖ­ప­ట్నం­లో జర­గ­ను­న్న సీ­సీఐ భా­గ­స్వా­మ్య సద­స్సు­ను ఘనం­గా ని­ర్వ­హిం­చా­ల­ని.. ఆ సద­స్సు కంటే ముం­దే తా­జా­గా ఆమో­దం పొం­దిన పరి­శ్ర­మ­ల­కు శం­కు­స్థా­ప­న­లు పూ­ర్తి చే­యా­ల­ని ము­ఖ్య­మం­త్రి ఆదే­శా­లు జారీ చే­శా­రు. ఈ శం­కు­స్థా­పన కా­ర్య­క్ర­మా­ల్లో తాను, డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్, మం­త్రి లో­కే­ష్ పా­ల్గొం­టా­మ­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News