సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. మూడు గంటలకు పైగా జరిగిన సమావేశంలో మంత్రి వర్గం పలు అంశాలపై చర్చించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అమరావతిలో నిర్మాణాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. . ఇరవై ఒక్క అంశాలు ఏజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. జల్ జీవన్ మిషన్కు సంబంధించి పనులను రద్దుచేసి తిరిగి మాడిఫై చేసిన ఐదు పనులకు రీ టెండర్ పిలిచేందుకు, అగ్రిమెంటు గడువు పొడిగించేందుకు క్యాబినెట్లో ఆమోదించారు.
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్కు 14 పోస్టులకు గ్రీన్సిగ్నల్
అమరావతి అభివృద్ధికి హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు కేఎఫ్ డబ్ల్యు నుంచి రూ.16 వేల కోట్లు రుణం తీసుకోవడానికి ఆమోదం.
ఏపీ రిసర్వే ప్రాజెక్టుకు సంబంధించి గ్రామ కంఠం భూముల సర్వే కోసం తీసుకున్న 679 సూపర్ న్యుమరి డిప్యూటీ తహసీల్దార్లను మరో రెండేళ్లు కొనసాగించేందుకు అనుమతి
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్ర ఏర్పాటుకు 50 ఎకరాల 20 సెంట్లు భూమికి ఓకే చెప్పిన క్యాబినెట్