ఏపీలో కొత్తగా 9,999 మందికి కరోనా నిర్ధారణ
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో మొత్తం 71,137 సాంపిల్స్ ని పరీక్షించగా 9,999 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా..;
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో మొత్తం 71,137 సాంపిల్స్ ని పరీక్షించగా 9,999 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కోవిడ్ వల్ల కడప లో తొమ్మిది మంది, చిత్తూరు లో ఎనిమిది మంది, నెల్లూరు లో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, గుంటూరు లో ఏడుగురు, కృష్ణ లో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, విజయనగరం లో ఐదుగురు, పళ్చిమ గోదావరి లో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, కర్నూల్ లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 11,069 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 5,44,791 పాజిటివ్ కేసులకు గాను 4,43,821 మంది డిశ్చార్జ్ కాగా.. 4,779 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 96,191గా ఉంది.