ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. మరోసారి పదివేలకుపైగా కేసులు
ఏపీలో మరోసారి పదివేలకుపైగా కరోనా కేసులు;
ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. మరోసారి పదివేలకుపైగా కేసులు లేదు. గత 24 గంటల్లో 62,024 శాంపిల్స్ ని పరీక్షించగా 10,548 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల చిత్తూరు లో పదిహేను మంది, నెల్లూరు లో పదకొండు మంది, తూర్పు గోదావరి లో ఎనిమిది మంది, పశ్చిమ గోదావరి లో ఎనిమిది మంది, అనంతపూర్ లో ఆరుగురు, గుంటూరు లో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, ప్రకాశం లో ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, శ్రీకాకుళం లో నలుగురు, విజయనగరం లో నలుగురు, కడప లో ఇద్దరు మరియు కృష్ణ లో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 8,976 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 4,11,269 పాజిటివ్ కేసు లకు గాను 3,09,792 మంది డిశ్చార్జ్ కాగా.. 3,796 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 97,681 గా ఉంది.