టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
టెన్త్, ఇంటర్ పరీక్షలు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచని చెప్పింది.
టెన్త్, ఇంటర్ పరీక్షలు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచని చెప్పింది. లక్షల మంది విద్యార్థుల జీవితాలకు ముడిపడిన విషయమన్న కోర్టు.. పక్క రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తే మీరెలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్ బాధిత విద్యార్థులకు విడిగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పగా... విద్యార్థుల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకెలా తెలుస్తుందని కోర్టు నిలదీసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే నెల 3 కి వాయిదా వేసింది.