ప్రభుత్వ స్థలం పేదలకు ఇవ్వాలన్న నిర్ణయంపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు

Update: 2020-10-16 11:13 GMT

విశాఖ జిల్లా కాపులుప్పాడులో ప్రభుత్వ స్థలాన్ని పేదలకు ఇవ్వాలన్న నిర్ణయంపై హైకోర్టు స్టేటస్‌ కో ఇచ్చింది. ఇటీవల కాపులుప్పాడులోని 20 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ స్థలమంతా బౌద్ధుని స్థూపం ఉన్న చారిత్రాత్మక ప్రదేశమని... పురావస్తు చట్టం, పర్యావరణ చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని కొత్తపల్లి వెంకట రమణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. స్టేటస్‌ కో ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News