AP; ఏపీలో ఎన్టీఆర్‌ వైద్య సేవలు పునరుద్ధరణ

ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ చర్చలు సఫలం.. ఆందోళన విరమించిన ప్రైవేటు ఆస్పత్రులు.. తిరిగి ప్రారంభమైన ఎన్టీఆర్ వైద్య సేవలు... బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం హామీ

Update: 2025-11-01 04:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో కొ­ద్ది రో­జు­లు­గా ని­లి­చిన ఎన్టీ­ఆ­ర్ వై­ద్య­సే­వల పు­న­రు­ద్ద­ర­ణ­కు కూ­ట­మి ప్ర­భు­త్వం చే­సిన ప్ర­య­త్నా­లు వి­జ­వం­త­మ­య్యా­యి. వై­ద్య సే­వ­ల­ను ని­లి­పిన ఆం­ధ్ర­ప్ర­దే­శ్ స్పె­షా­లి­టీ హా­స్పి­ట­ల్స్ అసో­సి­యే­ష­న్ (ఆశా) ప్ర­తి­ని­ధు­ల­తో ప్ర­భు­త్వం జరి­పిన చర్చ­లు సఫ­ల­మ­య్యా­యి. ని­లి­చిన ఎన్టీ­ఆ­ర్ వై­ద్య ఆరో­గ్య సే­వ­లు ఈ రోజు నుం­చే తి­రి­గి ప్రా­రం­భ­మ­య్యా­యి. బకా­యి­లు అన్నిం­టి­నీ చె­ల్లిం­చేం­దు­కు ప్ర­భు­త్వం స్ప­ష్ట­మైన హామీ ఇవ్వ­డం­తో ఆం­దో­ళన వి­ర­మి­స్తు­న్న­ట్లు ప్రై­వే­టు ఆస్ప­త్రుల యా­జ­మా­న్యాల ప్ర­తి­ని­ధు­లు ప్ర­క­టిం­చా­రు.

రూ.250 కోట్లు వెంటనే విడుదల

ఎన్టీ­ఆ­ర్ వై­ద్య సేవల బకా­యి­లు చె­ల్లిం­చా­ల­ని డి­మాం­డ్ చే­స్తూ ప్రై­వే­ట్ నెట్ వర్క్ ఆస్ప­త్రు­లు గత 20 రో­జు­లు­గా ఆం­దో­ళన చే­ప­డు­తు­న్నా­యి. ప్రై­వే­ట్ ఆస్ప­త్రుల సమ్మె­తో ఏపీ ప్ర­భు­త్వం ప్రా­థ­మి­కం­గా 250 కో­ట్ల రూ­పా­య­లు వి­డు­దల చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. మి­గ­తా బకా­యిల మొ­త్తా­న్ని కూడా వి­డ­తల వా­రీ­గా వి­డు­దల చే­స్తా­మ­ని ప్రై­వే­ట్ ఆస్ప­త్రుల యా­జ­మా­న్యా­ల­కు హామీ ఇచ్చిం­ది. అయి­న­ప్ప­టి­కీ ప్రై­వే­ట్ ఆస్ప­త్రుల అసో­సి­యే­ష­న్ సమ్మె కొ­న­సా­గిం­చిం­ది. దీం­తో బకా­యి­లు మొ­త్తం వన్‌ టైం సె­టి­ల్‌­మెం­ట్‌ కింద నవం­బ­ర్‌ చి­వ­రి­క­ల్లా చె­ల్లి­స్తా­మ­ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం హామీ ఇచ్చిం­ది. దీం­తో ప్రై­వే­ట్ ఆస్ప­త్రు­లు సమ్మె వి­ర­మిం­చా­యి. ఎన్టీ­ఆ­ర్ వై­ద్య సే­వ­ల­కు సం­బం­ధిం­చి రూ.2,700 కో­ట్లు బకా­యి­లు చె­ల్లిం­చా­ల­ని కో­రు­తూ ఈ నెల 10వ తేదీ నుం­చి రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా అన్ని ప్రై­వే­టు ఆస్ప­త్రు­ల్లో ఎన్టీ­ఆ­ర్ వై­ద్య సే­వ­ల­ను యా­జ­మా­న్యా­లు ని­లి­పి­వే­శా­యి. ఈ డి­మాం­డ్‌­తో గత 20 రో­జు­లు­గా ప్రై­వే­ట్‌ నె­ట్‌­వ­ర్క్‌ ఆసు­ప­త్రు­లు సమ్మె చే­స్తు­న్నా­యి. ఇప్ప­టి­కే పలు­మా­ర్లు అసో­షి­యే­ష­న్ ప్ర­తి­ని­ధు­ల­తో చర్చ­లు జరి­పిన ప్ర­భు­త్వం రూ.250 కో­ట్లు చె­ల్లిం­పు­లు చే­సిం­ది. వె­ల­గ­పూ­డి­లో­ని సచి­వా­ల­యం­లో ఆస్ప­త్రుల అసో­షి­యే­ష­న్ ప్ర­తి­ని­ధు­ల­తో వై­ద్య ఆరో­గ్య శాఖ మం­త్రి సత్య­కు­మా­ర్ యా­ద­వ్ సమా­వే­శ­మై సమ­గ్రం­గా చర్చిం­చా­రు. మరో­వై­పు బి­ల్లు బకా­యి­లు చె­ల్లిం­చా­ల­ని డి­మాం­డ్ చే­స్తూ అక్టో­బ­ర్ పదో తేదీ నుం­చి సమ్మె జరు­గు­తోం­ది. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ వ్యా­ప్తం­గా 841 నె­ట్‌­వ­ర్క్‌ ఆసు­ప­త్రు­లు ఉంటే.. సు­మా­రు­గా 467 ఆసు­ప­త్రు­లు ఈ సమ్మె­లో పా­ల్గొ­న్నా­యి. వీ­టి­లో కొ­న్ని ఆస్ప­త్రు­లు ఎన్టీ­ఆ­ర్‌ వై­ద్య­సేవ ఓపీ ని­లి­పి­వే­శా­యి, కే­వ­లం అత్య­వ­సర సే­వ­లే అం­దిం­చా­యి. మరి­కొ­న్ని ఆస్ప­త్రు­లు అత్య­వ­సర సే­వ­ల­తో పా­టు­గా ఓపీ­ల­ను కూడా ని­లి­పి­వే­శా­యి.

 మంత్రి హామీ..

ఇన్సూ­రె­న్స్​­తో ప్రై­వే­టు ఆస్ప­త్రు­ల­కు ఎక్క­డా అన్యా­యం జర­గ­ద­ని, వారి సహ­కా­రం­తో­నే ప్ర­జ­లం­ద­రి­కీ మె­రు­గైన వై­ద్యం అం­దిం­చే­లా ప్ర­భు­త్వం ని­ర్ణ­యం తీ­సు­కుం­టుం­ద­ని మం­త్రి సత్య­కు­మా­ర్ హామీ ఇచ్చా­రు. చి­కి­త్స­ల­కు చె­ల్లిం­చే మొ­త్తా­ల­ను పెం­చే అం­శం­పై­నా చర్చిం­చా­రు. ప్రై­వే­టు ఆస్ప­త్రుల సహ­కా­రం, భా­గ­స్వా­మ్యం­తో­నే ఇన్సూ­రె­న్స్ వి­ధా­నం అమలు జరు­గు­తుం­ద­ని ఆశి­స్తు­న్న­ట్లు ప్ర­తి­ని­ధు­లు తె­లి­పా­రు. ప్ర­భు­త్వం సమ­స్య­ల­ను ప్ర­భు­త్వం పరి­ష్కా­రా­ని­కి హామీ ఇచ్చి­నం­దు­కు తక్ష­ణం రా­ష్ట్ర వ్యా­ప్తం­గా అన్ని ప్రై­వే­టు ఆస్ప­త్రు­ల్లో ఎన్టీ­ఆ­ర్ వై­ద్య సే­వ­ల­ను తి­రి­గి ప్రా­రం­భి­స్తు­న్న­ట్లు ఆశా ప్ర­తి­ని­ధు­లు ప్ర­క­టిం­చా­రు. ఈ చర్చ­లు ఫలిం­చ­డం­తో సమ్మె వి­ర­మి­స్తు­న్న­ట్లు ప్రై­వే­ట్ ఆస్ప­త్రుల అసో­సి­యే­ష­న్ ప్ర­క­టిం­చిం­ది. మరో­వై­పు ఎన్టీ­ఆ­ర్ వై­ద్య సేవల బకా­యి­లు సు­మా­రు­గా రూ.2,700 కో­ట్ల వరకూ ఉన్నా­యి. దీం­తో ఈ బకా­యి­ల­ను చె­ల్లిం­చా­ల­ని ప్రై­వే­ట్ ఆస్ప­త్రు­లు డి­మాం­డ్ చే­స్తూ సమ్మె­కు ది­గా­యి.

Tags:    

Similar News