AP: పాస్ పుస్తకాలలో క్యూ ఆర్ కోడ్

ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు కీలక ని­ర్ణ­యం;

Update: 2025-07-06 06:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ లో రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా భూమి హక్కు­ల­పై పా­ర­ద­ర్శ­క­త­ను తీ­సు­కు­రా­వ­డ­మే లక్ష్యం­గా, ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. పా­స్‌ పు­స్త­కా­ల్లో QR కోడ్ వ్య­వ­స్థ­ను ప్ర­వే­శ­పె­ట్టా­ల­ని ఆయన ఆదే­శిం­చా­రు. దీని ద్వా­రా ప్ర­తి భూ­మి­కి సం­బం­ధిం­చిన సమ­గ్ర సమా­చా­రం డి­జి­ట­ల్ రూ­పం­లో అం­దు­బా­టు­లో ఉం­డ­నుం­ది. ఈ ఆధు­ని­కీ­క­ర­ణ­తో భూ సం­బం­ధిత మో­సా­ల­ను అరి­క­ట్టే అవ­కా­శం ఉం­ద­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. ఈ నే­ప­థ్యం­లో వచ్చే ఆగ­స్టు 15 నుం­చి కొ­త్త­గా ము­ద్రిం­చిన QR కోడ్ పా­స్‌­పు­స్త­కా­ల­ను ఉచి­తం­గా పం­డుగ వా­తా­వ­ర­ణం­లో పం­పి­ణీ చే­యా­ల­న్న­ది సీఎం ఆదే­శం. అమ­రా­వ­తి­లో­ని సచి­వా­ల­యం­లో రె­వె­న్యూ శా­ఖ­పై ని­ర్వ­హిం­చిన సమీ­క్ష­లో పలు కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు. ము­ఖ్యం­గా పేదల భూ సమ­స్యల పరి­ష్కా­రా­ని­కి సం­బం­ధిం­చి 10 అం­శా­ల­పై సీఎం సు­దీ­ర్ఘం­గా చర్చిం­చా­రు.  భూమి వా­ర­స­త్వ సర్టి­ఫి­కె­ట్ల వి­ష­యం­లో కూడా ప్ర­భు­త్వం ప్ర­గ­తి­శీల ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. రూ.10 లక్షల లోపు వి­లు­వ­గల భూ­ముల వా­ర­స­త్వ సర్టి­ఫి­కె­ట్లు గ్రామ సచి­వా­ల­యా­ల్లో కే­వ­లం రూ.100 చె­ల్లిం­చి పొం­దే­లా వె­సు­లు­బా­టు కల్పిం­చ­నుం­ది. రూ.10 లక్షల పై­బ­డి వి­లు­వైన భూ­ము­ల­కు రూ.1000 ఫీ­జు­తో సె­క్ష­న్ సర్టి­ఫి­కె­ట్లు జారీ చే­య­నుం­ది.  ఈ ని­ర్ణ­యా­ల­తో సా­మా­న్య రై­తు­ల­కు, భూమి వా­ర­సు­ల­కు భూ హక్కు­ల­పై స్ప­ష్టత లభిం­చ­నుం­డ­గా, రె­వె­న్యూ శా­ఖ­లో పా­ర­ద­ర్శ­కత మరింత పె­రి­గే అవ­కా­శం ఉం­ద­ని అధి­కా­రు­లు అభి­ప్రా­య­ప­డ్డా­రు. భూముల [రీ సర్వే ](https://telugu.hindustantimes.com/andhra-pradesh/land-prices-are-increasing-again-in-amaravati-121718278403820.html)పేరుతో గత ప్రభుత్వం పొలాల సర్వే చేయించిదని, ఇందుకోసం భారీగా నిధులు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు.

 శ్రావణ మాసంలో 3 లక్షల పేదల గృహప్రవేశాలు

ఏపీ ప్రభుత్వం పేదలకు గృహ కలను నెరవేర్చేందుకు శ్రావణ మాసాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే శ్రావణంలో 3 లక్షల ఇళ్లను పూర్తిచేసి, గృహప్రవేశాలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే సుమారుగా లక్ష మందికి రూ.300 కోట్లు మంజూరు చేయగా, 50 వేల మందికి ఇళ్ల నిర్మాణం పునఃప్రారంభమైంది. గత 13 నెలల్లో 2.30 లక్షల ఇళ్లు పూర్తి కాగా, 87 వేల ఇళ్లు రూఫ్‌ స్థాయికి, 1.2 లక్షల ఇళ్లు లింటెల్‌ స్థాయికి, 50 వేల ఇళ్లు బేస్‌మెంట్‌ వరకు నిర్మితమయ్యాయి. మిగిలిన నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తోంది. ప్రతి ఇంటికి కేంద్రం రూ.1.50 లక్షలు, ఉపాధి హామీ కింద రూ.30 వేలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 అదనంగా అందిస్తోంది. అంతేకాక, ఎస్సీలకు ₹50,000, బీసీలకు ₹50,000, ఎస్టీలకు ₹75,000, గిరిజనులకు ₹1,00,000 అదనపు నిధులు అందిస్తుంది. ఇందులో భాగంగా 'అందరికీ ఇళ్లు' కార్యక్రమానికి ఊపందిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమిని అందించేలా చర్యలు తీసుకుంటోంది. కేటాయించిన ప్లాట్లకు 10 ఏళ్ల ఫ్రీ హోల్డ్ హక్కులతో కూడిన కన్వేయన్స్ డీడీ‌ను అందించనుంది. ఇంటి స్థలం పొందిన వారు 2 సంవత్సరాల్లోగా నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది. జీవితంలో ఒక్కసారే ఉచిత స్థలం ఇవ్వబడుతుందని నిబంధనల ద్వారా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పేదలకు తలదాల్చుకునే గొడుగు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 'అందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని అందించే అంశంపై ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అందరికీ ఇళ్లు అనే ప్రాతిపదికన కేటాయించిన ప్లాట్లకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ జారీ చేస్తుందని ఉత్తర్వులో వెల్లడించారు.

Tags:    

Similar News