AP: ఏపీలో సోషల్ మీడియా బ్యాన్?

మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

Update: 2026-01-22 10:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో సో­ష­ల్ మీ­డి­యా వి­ని­యో­గం­పై కీలక చర్చ మొ­ద­లైం­ది. ము­ఖ్యం­గా చి­న్నా­రుల భద్రత, వారి మా­న­సిక ఆరో­గ్యా­న్ని దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని ప్ర­భు­త్వం కఠిన ని­ర్ణ­యాల వైపు అడు­గు­లు వే­స్తోం­ద­న్న సం­కే­తా­లు స్ప­ష్టం­గా కని­పి­స్తు­న్నా­యి. రా­ష్ట్రం­లో 16 ఏళ్ల­లో­పు పి­ల్ల­ల­కు సో­ష­ల్ మీ­డి­యా వి­ని­యో­గా­న్ని ని­షే­ధిం­చే అం­శా­న్ని ప్ర­భు­త్వం సీ­రి­య­స్‌­గా పరి­శీ­లి­స్తోం­ద­ని ఏపీ మం­త్రి నారా లో­కే­శ్ వె­ల్ల­డిం­చా­రు. ఈ వ్యా­ఖ్య­లు రా­జ­కీయ, సా­మా­జిక వర్గా­ల్లో వి­స్తృత చర్చ­కు దారి తీ­శా­యి. దా­వో­స్‌­లో జరు­గు­తు­న్న ప్ర­పంచ ఆర్థిక వే­దిక (వర­ల్డ్ ఎక­నా­మి­క్ ఫోరం) సద­స్సు­లో పా­ల్గొ­న్న సం­ద­ర్భం­గా మం­త్రి నారా లో­కే­శ్ ఈ అం­శం­పై మా­ట్లా­డా­రు. చి­న్న వయ­స్సు­లో పి­ల్ల­లు సో­ష­ల్ మీ­డి­యా కం­టెం­ట్‌­ను సరైన రీ­తి­లో అర్థం చే­సు­కో­లే­ర­ని, అది వారి ఆలో­చ­నా వి­ధా­నం­పై తీ­వ్ర ప్ర­భా­వం చూ­పు­తోం­ద­ని ఆయన అభి­ప్రా­య­ప­డ్డా­రు. అం­దు­కే పి­ల్ల­ల­ను రక్షిం­చేం­దు­కు కఠి­న­మైన చట్టా­లు అవ­స­ర­మ­ని స్ప­ష్టం చే­శా­రు.

ఆస్ట్రేలియా తరహా చట్టం

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే అవకాశాలపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికే చిన్నారుల కోసం సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఏపీలోనూ పిల్లలకు హానికరంగా మారుతున్న డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇది నిషేధమా? నియంత్రణా? అన్నది ఇంకా తుది దశకు రాలేదని, అయితే పిల్లల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వల్ల చిన్నారుల్లో మానసిక ఒత్తిడి, వ్యసనాలు, దారి తప్పే ఆలోచనలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు సమాచారం, హింసాత్మక కంటెంట్, అసభ్య వీడియోలు, సైబర్ బుల్లీయింగ్ వంటి అంశాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Tags:    

Similar News