తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ!

ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు..

Update: 2021-02-04 11:45 GMT

ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. ఆ తర్వాత రంగనాయకులు మండపంలో వేద పండితులు నిమ్మగడ్డకు ఆశీర్వచనాలు అందజేశారు.. పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆయనకు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని ఎస్‌ఈసీ తెలిపారు.. ప్రశాంతంగా, సవ్యంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగాలని స్వామివారిని ప్రార్థించినట్లు నిమ్మగడ్డ తెలిపారు.

Tags:    

Similar News