AP: రాజధాని పేరుతో మూడు ముక్కలాట

వైసీపీ పాలనలో అమరావతిలో భారీ విధ్వంసం.. విధ్వంసాన్ని సరిచేస్తున్నామన్న ఏపీ సర్కార్... శాసనసభలో అమరావతిపై మంత్రి సమాధానం

Update: 2025-09-25 03:30 GMT

అమ­రా­వ­తి పు­న­ర్ని­ర్మాణ పను­లు శర­వే­గం­గా సా­గు­తు­న్నా­య­ని శా­స­న­సభ వే­ది­క­గా పు­ర­పా­లక శాఖ మం­త్రి నా­రా­యణ వె­ల్ల­డిం­చా­రు. రా­జ­ధా­ని అమ­రా­వ­తి ని­ర్మా­ణా­ని­కి సం­బం­ధిం­చి బీ­జే­పీ ఎమ్మె­ల్యే వి­ష్ణు­కు­మా­ర్ రాజు అడి­గిన ప్ర­శ్న­కు మం­త్రి నా­రా­యణ సమా­ధా­నం ఇచ్చా­రు. అమ­‌­రా­వ­‌­తి­లో సీ­ఆ­ర్డీఏ నుం­చి 21 ప‌­ను­లు, ఏడీ­సీ నుం­చి 64 ప‌­ను­లు చే­ప­‌­ట్టా­ర­న్నా­రు. రా­జ­‌­ధా­ని కోసం 35,000 ఎక­‌­రాల భూ­మి­ని ల్యాం­డ్ పూ­లిం­గ్ స్కీం ద్వా­రా తీ­సు­కు­న్నా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. భూ­ము­లి­చ్చిన రై­తు­ల­‌­కు అభి­వృ­ద్ధి చేసి తి­రి­గి ఇవ్వా­ల్సిన బా­ధ్య­‌త ప్ర­‌­భు­త్వం­పై ఉం­ద­న్నా­రు. గ‌త ప్ర­‌­భు­త్వం రా­జ­‌­ధా­ని­ని ని­ర్వీ­ర్యం చేసి మూ­డు­ము­క్క­‌­లాట ఆడిం­ద­ని మం­డి­ప­డ్డా­రు. అమ­‌­రా­వ­‌­తి­లో చె­ట్లు తొ­ల­‌­గిం­చేం­దు­కు రూ.30 కో­ట్లు ఖ‌­ర్చు పె­ట్టా­ల్సి వ‌­చ్చిం­ద­ని వి­వ­రిం­చా­రు. రా­జ­ధా­ని ని­ర్మాణ పను­ల్లో ప్ర­స్తు­తం 10 వేల మంది కా­ర్మి­కు­లు పని చే­స్తు­న్నా­ర­ని మం­త్రి నా­రా­యణ తె­లి­పా­రు. వై­సీ­పీ ప్ర­భు­త్వం రా­జ­‌­ధా­ని­ని ని­ర్వీ­ర్యం చేసి మూడు ము­క్క­లాట ఆడిం­ద­ని.. దీం­తో అమ­‌­రా­వ­‌­తి­లో అడ­వి­లా పె­రి­గిన చె­ట్ల­ను తొ­ల­‌­గిం­చేం­దు­కు రూ.30 కో­ట్లు ఖ‌­ర్చు పె­ట్టా­ల్సి వచ్చిం­ద­న్నా­రు. రా­జ­ధా­ని­లో ట్రం­క్ రో­డ్లు, లే అవు­ట్ రో­డ్లు, ఎమ్మె­ల్యే, ఎమ్మె­ల్సీ, జ‌­డ్జీల బం­గ్లా­లు, అధి­కా­రు­లు, ఉద్యో­గుల ని­వా­సాల ని­ర్మా­ణా­లు వే­గం­గా జరు­గు­తు­న్నా­య­న్నా­రు. మా­ర్చి 31 నా­టి­కి 3,500 ఫ్లా­ట్ల ని­ర్మా­ణం పూ­ర్తి చే­స్తా­మ­ని తె­లి­పా­రు. గతం­లో పను­లు చే­ప­ట్టిన కాం­ట్రా­క్ట­ర్ల­కు బి­ల్లుల చె­ల్లిం­పు­ను పరి­శీ­లి­స్తు­న్న­ట్లు మం­త్రి నా­రా­యణ తె­లి­పా­రు.

వైసీపీ విధ్వంసం అంతా ఇంతా కాదు

అమ­రా­వ­తి­లో వై­సీ­పీ కు­ట్రల వల్ల జరి­గిన వి­ధ్వం­సా­న్ని సరి­చే­స్తు­న్నా­మ­ని అసెం­బ్లీ­లో మం­త్రి నా­రా­యణ వె­ల్ల­డిం­చా­రు. గతం­లో పను­లు చే­సిన కొం­ద­రు కాం­ట్రా­క్ట­ర్లు ఇప్పు­డు ముం­దు­కు రా­లే­ద­ని... మళ్లీ టెం­డ­ర్లు పి­ల­వా­ల్సి వచ్చిం­ద­న్నా­రు. హడ్కో, ప్ర­పంచ బ్యాం­కు ద్వా­రా రా­జ­ధా­ని ని­ర్మా­ణా­ని­కి రు­ణా­లు తీ­సు­కు­న్నా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. పను­లు ప్ర­ణా­ళి­క­బ­ద్ధం­గా జరు­గు­తు­న్నా­య­ని... పను­లు పూ­ర్త­య్యాక ప్ర­ధా­ని­ని పి­లి­చి ప్రా­రం­భో­త్స­వం చే­స్తా­మ­న్నా­రు. అమ­రా­వ­తి­ని ప్ర­పంచ స్థా­యి నగ­రం­గా తీ­ర్చి ది­ద్ద­డ­మే ప్ర­భు­త్వ లక్ష్యం అన్నా­రు. అను­మ­తుల ప్ర­క్రియ సు­ల­భ­త­రం చే­శా­మ­ని, పె­ట్టు­బ­డి దా­రు­ల­కు అను­కూ­ల­మైన వి­ధా­నా­లు తీ­సు­కొ­చ్చా­మ­ని తె­లి­పా­రు. అమ­రా­వ­తి రూ­పు­ది­ద్దు­కుం­టు­న్న ది­శ­లో ఈ ప్ర­ద­ర్శన ఒక పె­ద్ద మై­లు­రా­యి అవు­తుం­ద­ని తె­లి­పా­రు. అమ­రా­వ­తి త్వ­ర­లో­నే దే­శం­లో­నే అం­ద­మైన నగ­రం­గా ని­లు­స్తుం­ద­ని ఇక్కడ పె­ట్టు­బ­డి పె­ట్టే వా­రి­కి మంచి భవి­ష్య­త్ ఉం­టుం­ద­ని వి­వ­రిం­చా­రు. అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టే దిశగా ముందుకు సాగుతున్నామని నారాయణ వెల్లడించారు.

రెండు బిల్లులను ఆమోదించిన అసెంబ్లీ

సమా­వే­శా­ల్లో గ్రామ, వా­ర్డు సచి­వా­లయ సవరణ బి­ల్లు­ను మం­త్రి అచ్చె­న్నా­యు­డు సభలో ప్ర­వే­శ­పె­ట్టా­రు. ఈ బి­ల్లు­పై అన్ని పా­ర్టీల నే­త­లు ప్ర­సం­గిం­చి తమ అభి­ప్రా­యా­ల­ను సభ దృ­ష్టి తీ­సు­కొ­చ్చా­రు. దీం­తో స్పీ­క­ర్ అయ్య­న్న­పా­త్రు­డు గ్రామ, వా­ర్డు సచి­వా­లయ బి­ల్లు­ను ఆమో­దం పొం­ది­న­ట్లు­గా ప్ర­క­టిం­చా­రు. గ్రామ, వా­ర్డు సచి­వా­ల­యా­ల­ను జనా­భా ఆధా­రం­గా ఏ, బీ, సీ కే­ట­గి­రీ­లు­గా వి­భ­జిం­చిం­ది. ఈ వి­భ­జన సి­బ్బం­ది కే­టా­యిం­పు, సేవల సమ­ర్థ­త­ను మె­రు­గు­ప­ర­చ­డా­ని­కి చర్య­లు తీ­సు­కు­న్నా­రు. గ్రామ, వా­ర్డు సచి­వా­ల­యా­ల­ను రి­య­ల్‌­టైం గవ­ర్నె­న్స్ కా­ర్యా­ల­యా­లు­గా మా­ర్చా­ల­ని, నై­పు­ణ్యా­భి­వృ­ద్ధి, పరి­శ్రమ అభి­వృ­ద్ధి, ఉపా­ధి కల్పన, మా­ర్కె­టిం­గ్ వంటి కా­ర్య­క­లా­పా­ల­కు కేం­ద్రా­లు­గా ఉం­డా­ల­ని ప్ర­భు­త్వం లక్ష్యం­గా పె­ట్టు­కుం­ది. సచి­వా­ల­యాల ద్వా­రా జారీ చేసే సర్టి­ఫి­కె­ట్ల­పై ప్ర­భు­త్వ లోగో మా­త్ర­మే ఉం­డా­ల­ని, రా­జ­కీయ చి­హ్నా­లు లే­కుం­డా చూ­డా­ల­ని ఆదే­శా­లు జారీ చే­శా­రు.

చంద్రబాబు కీలక మలుపు

అమ­రా­వ­తి­ని అం­త­ర్జా­తీయ స్థా­యి నగ­రం­గా ని­ర్మి­స్తు­న్నా­మ­ని.. రా­జ­ధా­ని­లో చే­ప­ట్టే వి­విధ ప్రా­జె­క్టు­ల్లో బ్యాం­క­ర్లు భా­గ­స్వా­ము­లు కా­వా­ల­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు కో­రా­రు. అమ­రా­వ­తి­లో బ్యాం­కుల ప్రాం­తీయ కా­ర్యా­ల­యా­ల­ను ప్రా­రం­భిం­చా­ల­ని.. ఇప్ప­టి­కే స్థ­లా­లు కూడా కే­టా­యిం­చా­మ­ని చె­ప్పా­రు. రా­ష్ట్రా­ని­కి ఆర్థిక సాయం పెం­చా­ల­ని కో­రా­రు. వి­జ­య­వా­డ­లో జరి­గిన లో­క్‌­సభ సబా­ర్డి­నే­ట్‌ లె­జి­స్లే­ష­న్‌ కమి­టీ సమా­వే­శం తర్వాత బ్యాం­కుల ఛై­ర్మ­న్లు, సీ­ఎం­డీ­లు... చం­ద్ర­బా­బు­తో భేటీ అయ్యా­రు.అమ­రా­వ­తి­లో చే­ప­డు­తు­న్న ప్రా­జె­క్టు­లు, రో­డ్‌ మ్యా­ప్‌­పై సీఎం వా­రి­కి సమ­గ్ర వి­వ­రా­లం­దిం­చా­రు. 15 నెలల కూ­ట­మి ప్ర­భు­త్వ పా­ల­న­లో రా­ష్ట్రా­ని­కి వచ్చిన పె­ట్టు­బ­డు­లు, కేం­ద్ర ప్ర­భు­త్వ సహ­కా­రం­తో చే­ప­ట్టిన ప్రా­జె­క్టు­లు, రా­ష్ట్ర ప్ర­భు­త్వ వి­ధా­నా­లు, ప్ర­గ­తి ప్ర­ణా­ళి­కల గు­రిం­చి చె­ప్పా­రు. పో­ర్టు­లు, ఎయి­ర్‌ పో­ర్టు­లు, హా­ర్బ­ర్లు, జా­తీయ రహ­దా­రు­లు, క్వాం­ట­మ్‌ వ్యా­లీ తది­తర పనుల పు­రో­గ­తి­ని తె­లి­య­జే­శా­రు. వ్య­వ­సా­యం, వి­ద్యు­త్తు, నీ­టి­పా­రు­దల, వి­ద్య, వై­ద్య రం­గా­ల­తో­పా­టు పౌ­ర­సే­వ­ల్లో సాం­కే­తి­క­త­ను వి­స్తృ­తం­గా వి­ని­యో­గి­స్తు­న్నా­మ­న్నా­రు. రూ.1.20 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు వస్తు­న్నా­య­ని అన్నా­రు.

Tags:    

Similar News