గన్నవరం టీడీపీ ఇంఛార్జిగా బచ్చుల అర్జునుడు

Update: 2020-10-01 08:27 GMT

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఇంఛార్జిగా బచ్చుల అర్జునుడు నియమితులయ్యారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేది తెలుగు దేశం పార్టీ మాత్రమేనని ఈ సందర్భంగా బచ్చుల అర్జునుడు అన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరంలోనే ఉంటూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ సేవకుడినే అని చెప్పారు. తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేస్తానని బచ్చుల అర్జునుడు అన్నారు.  

Similar News