సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. పిటిషన్కు సంబంధించి ఒక్కమాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్ అని ధర్మాసనం పేర్కొంది. సీఐడీ కేసులు సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బాలయ్య పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.