BUS ACCIDENT: కర్నూలు బస్సు ప్రమాదం.. డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి

19 మృతదేహాలను గుర్తించిన వైద్యులు.. 18 మృతదేహాల అప్పగింత పూర్తి

Update: 2025-10-27 02:30 GMT

కర్నూ­లు జి­ల్లా­లో రెం­డు రో­జుల కింద జరి­గిన ఘోర బస్సు ప్ర­మా­దం­లో సజీవ దహ­న­మైన ప్ర­యా­ణి­కుల మృ­త­దే­హా­ల­ను కు­టుం­బ­స­భ్యు­ల­కు అప్ప­గిం­చా­రు. ఒక మృ­త­దే­హం మి­న­హా మి­గ­తా డె­డ్‌­బా­డీ­స్‌­ను డీ­ఎ­న్ఏ టె­స్టుల అనం­త­రం వారి కు­టుం­బ­స­భ్యు­ల­కు అప్ప­గింత ప్ర­క్రియ పూ­ర్త­యిం­ది. ఈ మే­ర­కు అధి­కా­రు­లు తీ­సు­కు­న్న చర్య­లు, తుది ని­వే­దిక వి­వ­రా­ల­ను కర్నూ­లు జి­ల్లా కలె­క్ట­ర్, ఎస్పీ వె­ల్ల­డిం­చా­రు. మరణ ధ్రు­వీ­క­రణ పత్రా­ల­ను కూడా వా­రి­కి అం­దిం­చా­రు. ఈ ప్ర­క్రి­య­ను జి­ల్లా కలె­క్ట­ర్‌ ఎ.సిరి పర్య­వే­క్షిం­చా­రు. మృ­త­దే­హా­ల­ను స్వ­స్థ­లా­ల­కు చే­ర్చేం­దు­కు అం­బు­లె­న్స్‌­లు ఏర్పా­టు చే­శా­రు.

18 మృతదేహాల అప్పగింత

వే­మూ­రి కా­వే­రి ట్రా­వె­ల్స్ ప్ర­మా­దం­లో చని­పో­యిన వారి మృ­త­దే­హా­లు తీ­వ్రం­గా కా­లి­పో­వ­డం­తో, వా­టి­ని గు­ర్తిం­చ­డం కష్ట­మైం­ది. ఈ క్ర­మం­లో ఏపీ ప్ర­భు­త్వం మృ­త­దే­హా­ల­కు, వారి కటు­ుం­బ­స­భ్యు­ల­కు డీ­ఎ­న్ఏ టె­స్టు­లు ని­ర్వ­హిం­చిం­ది. ఆ ని­వే­దిక ఆధా­రం­గా గు­ర్తిం­చిన 18 మంది మృ­త­దే­హా­ల­ను అధి­కా­రు­లు వారి కు­టుంబ సభ్యు­ల­కు అప్ప­గిం­చా­రు. ఈ మొ­త్తం ప్ర­క్రి­య­ను జి­ల్లా కలె­క్ట­ర్ ఎ. సిరి స్వ­యం­గా పర్య­వే­క్షిం­చా­రు. మరణ ధ్రు­వీ­క­రణ పత్రా­ల­ను కూడా కు­టుం­బా­ల­కు అం­దిం­చా­రు. ఆ మృ­త­దే­హా­ల­ను వారి స్వ­స్థ­లా­ల­కు చే­ర్చేం­దు­కు అవ­స­ర­మైన అం­బు­లె­న్స్‌­ల­ను అధి­కా­రు­లు ఏర్పా­టు చే­శా­రు.

19వ మృతదేహం గుర్తింపు

కర్నూలు జిల్లా బస్సు దగ్ధం ఘటనలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. మొత్తం 19 మంది మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి అయ్యాయి. 18 మంది మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అయితే 19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా డీఎన్ఏ పరీక్షలో నిర్ధారణ అయింది. కాసేపట్లో మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. బైక్, బస్సు ప్రమాదం వేర్వేరుగా జరిగినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే బైక్ ప్రమాదంలో చనిపోయిన శివశంకర్ ప్రమాదానికి ముందు మద్యం సేవించినట్లు తేలింది. స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి మద్యం కొంటున్న విజువల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో బైకర్ శివశంకర్ ప్రమాదానికి గురవడానికి మద్యం మత్తే కారణంగా తేలింది.

Tags:    

Similar News