వైసీపీ ఎంపీ రఘురామ పిటిషన్ను స్వీకరించిన సీబీఐ కోర్టు..!
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.;
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు స్వయంగా వెల్లడించారు. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు.
ఇటీవల తాను నాంపల్లి సీబీఐ కోర్టులో తాను వేసిన పిటిషన్ మొదట్లో సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం తిరస్కరించిందని.. ఆ తర్వాత సవరణలు చేసి తిరిగి పిటిషన్ వేయడంతో తాజాగా తన పిటిషన్ను న్యాయస్థానం స్వీకరించినట్లు జడ్జి వెల్లడించారని వివరించారు. తన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన క్రమంలో, సీఎం జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేస్తారని భావిస్తున్నానని తెలిపారు.
ఉన్నత పదవుల్లో ఉన్న వారే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వకపోతే పౌరులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ పోరాటం మొదలు పెట్టానని రఘురామకృష్ణరాజు తెలిపారు.