CBN: ఉద్యాన రంగం మరో గేమ్ ఛేంజర్

వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో చర్చ... రైతులకే తొలి ప్రాధాన్యమన్న చంద్రబాబు... శాసనసభలో పవర్‌ పాయింట్ ప్రజంటేషన్

Update: 2025-09-23 03:30 GMT

ప్ర­తి ఎమ్మె­ల్యే నె­ల­కు ఒక రోజు రై­తుల దగ్గ­ర­కు వె­ళ్లి సమ­స్య­లు తె­లు­సు కో­వా­ల­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు సూ­చిం­చా­రు. వచ్చే నెల నుం­చి రై­తు­ల­కు సం­బం­ధిం­చి తక్షణ కా­ర్యా­చ­రణ ప్రా­రం­భి­స్తా­మ­ని ప్ర­క­టిం­చా­రు. తాను ఐటీ­పై మా­ట్లా­డి­తే ఐటీ వ్య­క్తి అను­కుం­టా­ర­ని, కానీ రై­తుల కో­స­మే ఎక్కువ ఆలో­చి­స్తా అన్నా­రు. వరి­కి ప్ర­త్యా­మ్నాయ పం­ట­ల­పై దృ­ష్టి పె­ట్టా­ల­న్నా­రు. ఆక్వా రై­తు­ల­ను ఆదు­కు­నేం­దు­కు అన్ని మా­ర్గా­ల­ను అన్వే­షి­స్తు­న్నాం అని, రై­తుల నికర ఆదా­యం పెం­చేం­దు­కు కృషి చే­స్తు­న్నాం అని సీఎం చె­ప్పా­రు. వ్య­వ­సా­యం, అను­బంధ రం­గాల ద్వా­రా రై­తు­ల­ను నం­బ­ర్ వన్‌­గా మా­ర్చేం­దు­కు ప్ర­భు­త్వం కట్టు­బ­డి ఉం­ద­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. వ్య­వ­సాయ రం­గం­పై శా­స­న­స­భ­లో జరి­గిన చర్చ­లో ఆయన మా­ట్లా­డా­రు. రై­తు­లు, వ్య­వ­సా­యం కోసం ప్ర­భు­త్వం చే­ప­డు­తు­న్న చర్య­ల­ను పవర్ పా­యిం­ట్ ప్ర­జెం­టే­ష­న్‌ ద్వా­రా వి­వ­రిం­చా­రు.

యూరియాకి పరిమితిఉండాలి

‘రై­తు­లు యూ­రి­యా­ను మో­తా­దు­కు మిం­చి వి­ని­యో­గి­స్తు­న్నా­రు. ఎరు­వుల వి­ని­యో­గం తగ్గి­స్తే పీఎం ప్ర­ణా­మ్‌ కింద ని­ధు­లు ఇస్తా­మ­ని కేం­ద్రం చె­ప్పిం­ది. పీఎం ప్ర­ణా­మ్‌ కింద కేం­ద్రం ఇచ్చిన ని­ధు­ల­ను రై­తు­ల­కు చె­ల్లి­స్తాం. చరి­త్ర­లో తొ­లి­సా­రి హె­క్టా­రు ఉల్లి­కి రూ.50 వేలు ఇస్తు­న్నాం. సేం­ద్రీయ వ్య­వ­సా­యా­న్ని ప్రో­త్స­హిం­చా­ల్సిన అవ­స­రం ఉంది. రై­తు­ల­కు వ్య­వ­సా­యం గి­ట్టు­బా­టు కా­వా­లం­టే సేం­ద్రీయ వ్య­వ­సా­యం చే­యా­లి. రై­తు­లు బా­గుం­టే గ్రా­మీణ ఆర్థిక వ్య­వ­స్థ బా­గుం­టుం­ది. వ్య­వ­సా­యం లా­భ­సా­టి­గా మా­రేంత వరకు రై­తు­ల­కు ప్ర­భు­త్వం అం­డ­గా ఉం­టుం­ది. రైతు బజా­ర్లు, మొ­బై­ల్ రైతు బజా­ర్ల­లో ఆర్గా­ని­క్ వ్య­వ­సాయ ఉత్ప­త్తు­లు వి­క్ర­యిం­చే­లా చే­స్తాం. పొలం బడి, పొలం పి­లు­స్తోం­ది రా అనే వి­విధ కా­ర్య­క్ర­మాల ద్వా­రా గతం­లో రై­తు­ల­తో మా­ట్లా­డాం. ప్ర­తీ శా­స­న­స­భ్యు­డూ నె­ల­కు ఒక్క రోజు పొలం దగ్గ­ర­కు వె­ళ్లి రై­తు­ల­తో మా­ట్లా­డా­లి’ అని సీఎం చె­ప్పా­రు. పాడి పరి­శ్ర­మ­ను ప్రో­త్స­హిం­చ­డం ద్వా­రా వృ­ద్ధి రేటు సా­ధిం­చేం­దు­కు అవ­కా­శా­లు ఉన్నా­య­న్నా­రు. ఉద్యాన రంగం రా­ష్ట్రం­లో మరో గేమ్ ఛేం­జ­ర్‌­లా ఉం­ద­ని సీఎం వ్యా­ఖ్యా­నిం­చా­రు. 2029 నా­టి­కి ఉద్యాన పం­ట­ల­ను భా­రీ­గా పెం­చు­తా­మ­ని తె­లి­పా­రు. సూ­క్ష్మ సే­ద్యం ద్వా­రా లబ్ధి­పొం­దిన రా­ష్ట్రా­ల్లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ దే­శం­లో అగ్ర­గా­మి­గా ఉం­ద­న్నా­రు.

ట్రంప్‌ దెబ్బకు "అక్వా" విలవిల

ట్రం­ప్ దె­బ్బ­కు ఆక్వా రంగం వి­ల­వి­ల­లా­డు­తోం­ద­ని.. కొ­త్త మా­ర్కె­ట్ల కోసం కేం­ద్రం­తో మా­ట్లా­డు­తు­న్న­ట్లు సీఎం చె­ప్పా­రు. ఫుడ్ ప్రా­సె­సిం­గ్ రం­గం­పై­నా దృ­ష్టి సా­రిం­చి­న­ట్లు తె­లి­పా­రు. రై­తు­లు.. రసా­యన ఎరు­వు­లు, పు­రు­గు మం­దుల వి­ని­యో­గం తగ్గిం­చా­ల­ని సూ­చిం­చా­రు. అప్పు­డే నా­ణ్య­మైన పంట ఉత్ప­త్తు­లు వస్తా­య­ని, నా­ణ్య­మైన ఆహా­రం ప్ర­జ­ల­కు అం­దించ వచ్చ­ని స్ప­ష్టం చే­శా­రు. ఈ వి­ష­యం­లో రై­తు­ల­ను రె­చ్చ­గొ­ట్టే వారి పట్ల అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని హె­చ్చ­రిం­చా­రు. రా­ష్ట్రం­లో 35 శాతం మేర జీ­ఎ­స్డీ­పీ వ్య­వ­సా­యం నుం­చే వస్తోం­ది. రై­తు­లు, ప్ర­జా ప్ర­తి­ని­ధు­లు అం­ద­రం కలి­సి వ్య­వ­సా­యా­న్ని లా­భ­సా­టి చే­ద్దాం. నేను వ్య­వ­సాయ కు­టుం­బం నుం­చి వచ్చిన వ్య­క్తి­నే. ఐటీ గు­రిం­చి మా­ట్లా­డి­తే.. ఐటీ వ్య­క్తి అను­కుం­టా­రు కానీ నేను చే­సిన పను­ల­న్నీ రై­తు­ల­కు ఉప­క­రిం­చే­వే. నీరు, చె­ట్టు, రి­జ­ర్వా­య­ర్లు, చెక్ డ్యా­మ్లు, కా­లు­వ­లు ఇలా ప్ర­తీ అం­శా­న్నీ వ్య­వ­సాయ రం­గా­ని­కి అను­కూ­ల­మైన ఆలో­చ­న­లే చేశా. సా­గు­నీ­రు, వ్య­వ­సాయ రంగం అభి­వృ­ద్ధి­కే ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­ను. అక్టో­బ­రు నుం­చి క్షే­త్ర­స్థా­యి­లో రై­తుల సమ­స్య­లు తె­లు­సు­కు­నేం­దు­కు యా­క్ష­న్ ప్లా­న్ ప్ర­క­టి­స్తాం’ అని సీఎం చం­ద్ర­బా­బు తె­లి­పా­రు.

Tags:    

Similar News