CBN: అభివద్ధిలో మాది ఆల్‌టైం రికార్డు

నెలాఖరులోగా మెగా డీఎస్సీ నియామకాలు పూర్తి... ఏపీది డెత్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ.. భవిష్యత్తుకు బాటలు వేశామన్న చంద్రబాబు;

Update: 2025-08-16 02:30 GMT

“ 2024 ఎన్ని­క­ల్లో ప్ర­జ­లు గె­ల­వా­లి, రా­ష్ట్రం ని­ల­వా­లి" అనే ఎన్డీ­యే ని­నా­దా­న్ని ప్ర­జ­లు నమ్మి చరి­త్రా­త్మక తీ­ర్పు­ని­చ్చా­ర­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అన్నా­రు. ప్ర­జ­లు తమపై పె­ట్టు­కు­న్న నమ్మ­కా­న్ని ని­ల­బె­ట్టు­కు­ని.. బం­గా­రు భవి­ష్య­త్తు­కు బా­ట­లు వే­స్తు­న్నా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. వి­జ­య­వాడ ము­న్సి­ప­ల్ స్టే­డి­యం­లో 79వ స్వా­తం­త్ర్య వే­డు­క­ల­ను ఘనం­గా ని­ర్వ­హిం­చా­రు. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు జా­తీ­య­జెం­డా­ను ఆవి­ష్క­రిం­చా­రు. అనం­త­రం పో­లీ­సుల నుం­చి గౌరవ వం­ద­నం స్వీ­క­రిం­చా­రు. స్వా­తం­త్ర్య ది­నో­త్సవ వే­డు­క­ల్లో భా­గం­గా ఉత్తమ సే­వ­లం­దిం­చిన పో­లీ­సు ఉన్న­తా­ధి­కా­రు­ల­కు సీఎం పత­కా­లు అం­ద­జే­శా­రు.


మెగా డీ­ఎ­స్సీ ని­యా­మ­కా­ల­ను ఈ నె­లా­ఖ­రు­కు పూ­ర్తి చే­స్తా­మ­న్న చం­ద్ర­బా­బు... ‘పేదల సే­వ­లో’ కా­ర్య­క్ర­మం­లో భా­గం­గా 64 లక్షల మం­ది­కి ఎన్టీ­ఆ­ర్‌ భరో­సా పిం­ఛ­న్లు అం­దిం­చా­మ­ని గు­ర్తు చే­శా­రు. ఇంటి వద్దే పిం­ఛ­న్లు పం­పి­ణీ చేసి సం­క్షేమ రా­జ్యా­ని­కి కొ­త్త అర్థం ఇచ్చా­మ­ని గు­ర్తు చే­శా­రు. పే­దిం­టి తల్లు­ల­కు ఆర్థిక భరో­సా ఇచ్చేం­దు­కు ‘తల్లి­కి వం­ద­నం’ తీ­సు­కొ­చ్చా­మ­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. అన్న­దాత సు­ఖీ­భవ పథకం కింద మొ­త్తం రూ.7 వేలు రై­తుల ఖా­తా­ల్లో వే­శా­మ­న్నా­రు. దీని ద్వా­రా 47 లక్షల మంది రై­తు­ల­కు రూ.3,173 కో­ట్లు అం­దిం­చా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. దీపం పథకం కింద ఏడా­ది­కి 3 సి­లిం­డ­ర్లు ఉచి­తం­గా ఇస్తు­న్నా­మ­న్న చం­ద్ర­బా­బు.. 2 కో­ట్ల రా­యి­తీ సి­లిం­డ­ర్లు ఇచ్చా­మ­న్నా­రు. ప్ర­జ­ల­కు నాడు కు­ను­కు లే­కుం­డా చే­సిన ల్యాం­డ్‌ టై­టి­లిం­గ్‌ యా­క్ట్‌ రద్దు చే­శా­ర­ని... పేద ప్ర­జల ఆకలి తీ­ర్చేం­దు­కు అన్న క్యాం­టీ­న్లు తి­రి­గి తె­రి­చా­మ­ని వె­ల్ల­డిం­చా­రు.

"బనకచర్లతో ఎవ్వరికీ నష్టం లేదు"

బన­క­చ­ర్ల­తో ఏ రా­ష్ట్ర నీటి ప్ర­యా­జ­నా­ల­కు నష్టం వా­టి­ల్ల­ద­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు పు­న­రు­ద్ఘా­టిం­చా­రు. స్వా­తం­త్ర్య ది­నో­త్సవ సం­బ­రా­ల్లో పా­ల్గొ­న్న సీఎం.. " గో­దా­వ­రి వృథా జలా­ల­ను పో­ల­వ­రం నుం­చి బన­క­చ­ర్ల­కు మళ్లిం­చా­ల­ని సూ­చిం­చా­రు. సము­ద్రం­లో­కి వృ­థా­గా పోయే నీ­టి­నే వి­ని­యో­గి­స్తాం. బన­క­చ­ర్ల­తో ఏ రా­ష్ట్ర నీటి ప్ర­యో­జ­నా­ల­కూ నష్టం వా­టి­ల్ల­దు. దీ­ని­కి ఎవరూ అభ్యం­త­రం చె­ప్పా­ల్సిన అవ­స­రం లేదు. ప్ర­కా­శం జి­ల్లా­ను కరవు నుం­చి బయ­ట­ప­డే­సే వె­లు­గొం­డ­కు అత్యంత ప్రా­ధా­న్యత ఇస్తు­న్నాం. వచ్చే ఏడా­ది జులై నా­టి­కి సా­గు­నీ­రు ఇచ్చే­లా ప్రా­జె­క్టు పను­లు చే­స్తు­న్నాం.” అని స్ప­ష్టం చే­శా­రు. అడ­వి­త­ల్లి బా­ట­లో’ ద్వా­రా రూ.1,000 కో­ట్ల­తో రో­డ్ల ని­ర్మా­ణం చే­ప­ట్టా­మ­న్న చం­ద్ర­బా­బు.. మా­రు­మూల గి­రి­జన ప్రాం­తా­ల­ను ప్ర­ధాన రహ­దా­రు­ల­తో అను­సం­ధా­ని­స్తు­న్నా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. రా­య­ల­సీ­మ­ను సస్య­శ్యా­మ­లం చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­మ­న్నా­రు.

Tags:    

Similar News