TG: ఈ నెల 22న రైతు భరోసా' నిధుల విడుదల

రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు

Update: 2026-03-16 04:30 GMT

తె­లం­గా­ణ­లో­ని రై­తు­ల­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వం తీపి కబు­రు అం­దిం­చిం­ది. ఎన్ని­కల వా­గ్దా­నం లో భా­గం­గా ప్ర­తి­ష్టా­త్మ­కం­గా చే­ప­ట్టిన 'రై­తు భరో­సా­'­ప­థ­కం ని­ధు­ల­ను ఈ నెల 22వ తే­దీన వి­డు­దల చే­సేం­దు­కు ప్ర­భు­త్వం ము­హూ­ర్తం ఖరా­రు చే­సిం­ది. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి స్వ­యం­గా ఈ కా­ర్య­క్ర­మా­న్ని ప్రా­రం­భిం­చ­ను­న్నా­రు. తొలి విడత ని­ధుల వి­డు­దల ద్వా­రా రా­ష్ట్ర వ్యా­ప్తం­గా ఉన్న లక్ష­లా­ది మంది రై­తుల ఖా­తా­ల్లో నే­రు­గా నగదు జమ కా­నుం­ది. గత కొం­త­కా­లం­గా ఈ ని­ధుల కోసం ఎదు­రు­చూ­స్తు­న్న రై­తు­ల­కు ఇది పె­ద్ద ఊర­ట­ని­చ్చే అంశం. ఈ పథకం ప్రా­రం­భో­త్స­వా­ని­కి సి­ద్ది­పేట జి­ల్లా నర్మె­ట్ట వే­దిక కా­నుం­ది. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి ఈ పర్య­ట­న­లో భా­గం­గా మొ­ద­టి విడత ని­ధు­ల­ను అధి­కా­రి­కం­గా వి­డు­దల చే­స్తా­రు. ఇం­దు­కో­సం అధి­కా­రు­లు ఇప్ప­టి­కే అన్ని ఏర్పా­ట్లు పూ­ర్తి చే­శా­రు. మొ­ద­టి వి­డ­త­లో భా­గం­గా ఎకరం వరకు వ్య­వ­సాయ భూమి ఉన్న 70 లక్షల రై­తుల ఖా­తా­ల్లో రూ. 3,590 కో­ట్ల నగదు జమ కా­నుం­ది. అలా­గే 20 రో­జుల అనం­త­రం రెం­డో వి­డ­త­లో రూ. 2,650 కో­ట్లు, ఏప్రి­ల్ నె­లా­ఖ­రున మూడవ విడత ని­ధు­లు రూ. 9 వేల కో­ట్లు నే­రు­గా రై­తుల ఖా­తా­ల్లో జమ చే­య­ను­న్నా­రు. గత ప్ర­భు­త్వం అం­దిం­చిన రైతు బంధు స్థా­నం­లో, పెం­చిన పె­ట్టు­బ­డి సా­యం­తో 'రై­తు భరో­సా­'­ను అమలు చే­స్తా­మ­ని కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం ప్ర­క­టిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. ఈ ని­ధుల వి­డు­దల ద్వా­రా సాగు పను­ల­కు అవ­స­ర­మైన ఖర్చుల కోసం రై­తు­ల­కు ఆర్థిక భరో­సా లభిం­చ­నుం­ది.

సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ....

రైతు భరోసా మొదటి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి పెట్టుబడి సాయంనిధులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి రిలీజ్‌‌‌‌ చేయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి సీఎం నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 70 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు రెండు విడతల్లో పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయనున్నారు. తొలి విడత పూర్తయిన 20 రోజుల తర్వాత.. రెండో విడత కింద మరో రూ.2,650 కోట్లను విడుదల చేసేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత నిధులను కూడా చెల్లించి, ఈ సీజన్‌‌‌‌కు సంబంధించిన పంపిణీని 100 శాతం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికిగానూ మొత్తంగా రూ.9 వేల కోట్లను3 దశల్లో బదిలీ చేయనున్నారు. ఎకరానికి ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తుండగా, ఈ ప్రస్తుత సీజన్‌‌‌‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం రైతుల చేతికి అందనున్నది.

Tags:    

Similar News