CBN: ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్నాం
కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి;
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుందన్నారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తొలి అడుగు ప్రజల్లో భరోసాను కలిగించిందని.. మలి అడుగు కూడా విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తూ సీఎం పోస్ట్ చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నామని అన్నారు.