CHANDRABABU: మహిళలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. రాఖీ పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్;

Update: 2025-08-07 02:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన బు­ధ­వా­రం జరి­గిన కే­బి­నె­ట్ సమ­వే­శం­లో పలు కీలక అం­శా­ల­పై చర్చిం­చి ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు.. రా­ష్ట్రం­లో­ని మహి­ళ­ల­కు ఉచిత బస్సు ప్ర­యాణ పథకం అమ­లు­కు కే­బి­నె­ట్‌ ఆమో­దం తె­లి­పిం­ది.. ఆగ­స్టు 15 నుం­చి స్వా­తం­త్య్ర ది­నో­త్సవ కా­ను­క­గా అమలు చే­య­బో­తు­న్నా­రు.. ఇక, ఏపీ ల్యాం­డ్ ఇని­షి­యే­టి­వ్స్ అండ్ టెక్ హబ్స్ (లి­ప్ట్) పా­ల­సీ 4.0… 2024-29కి కే­బి­నె­ట్‌ ఆమో­ద­ము­ద్ర వే­సిం­ది.. 22 ఏపీ టూ­రి­జం డె­వ­ల­ప్‌­మెం­ట్‌ హో­ట­ళ్లు, ఆరు క్ల­స్ట­ర్ల పరి­ధి­లో­ని రి­సా­ర్టుల ఆప­రే­ష­న్ల­కు ఏజె­న్సీల ఎం­పి­క­కు వీసీ అండ్ ఎం­డీ­కి అను­మ­తు­లు మం­జూ­రు చే­సిం­ది.. ఈనెల 9న రాఖీ పౌ­ర్ణ­మి వే­డు­క­లు జర­గ­బో­తు­న్నా­యి. ఈ నే­ప­థ్యం­లో ఏపీ కే­బి­నె­ట్ కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. పం­డుగ సం­ద­ర్భం­గా మహి­ళ­ల­కు బహు­మ­తి ఇవ్వా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. రా­ష్ట్రం­లో అమలు కా­ను­న్న ఫ్రీ బస్సు పథ­కం­పై ఈ నెల 9న సీఎం చం­ద్ర­బా­బు ప్ర­క­టన చే­య­ను­న్న­ట్లు మం­త్రు­లు తె­లి­పా­రు. అం­తే­కా­దు 15 నుం­చి మహి­ళ­ల­కు ఉచిత బస్సు పథకం అమలు చే­య­ను­న్న­ట్లు చె­ప్పా­రు. అలా­గే జి­ల్లాల పు­న­ర్వి­భ­జ­న­లో లో­పా­లు, సరి­హ­ద్దు సమ­స్య­లు ఉన్నా­య­ని, వా­టి­ని సరి­ది­ద్దా­ల­ని కే­బి­నె­ట్ ని­ర్ణ­యిం­చి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. అం­తే­కా­దు నె­ల­రో­జు­ల్లో ని­వే­దిక ఇవ్వా­ల­ని అధి­కా­రు­ల­ను సీఎం చం­ద్ర­బా­బు ఆదే­శిం­చి­న­ట్లు చె­ప్పా­రు. జన­గ­ణన ప్రా­రం­భ­మ­య్యే­లో­పే ఈ ప్ర­క్రి­య­ను పూ­ర్తి చే­యా­ల­ని చం­ద్ర­బా­బు ఆదే­శిం­చి­న­ట్లు కే­బి­నె­ట్ మం­త్రు­లు పే­ర్కొ­న్నా­రు.

కీలక నిర్ణయాలకు ఆమోదం

కే­బి­నె­ట్ సమా­వే­శం­లో కొ­త్త బార్ పా­ల­సీ­ను ఆమో­దిం­చా­రు. అయి­తే కల్లు గీత కా­ర్మి­కుల కోసం కే­టా­యిం­చిన షా­పు­ల్లో బి­నా­మీ­లు వస్తే సహిం­చ­న­ని హె­చ్చ­రిం­చా­రు. ఆర్టీ­సీ బస్సు­ల్లో స్త్రీ­ల­కు ఉచిత ప్ర­యా­ణం ప్రా­రం­భా­ని­కి ముం­దే.. ఆటో డ్రై­వ­ర్ల­ను పి­లి­పిం­చి వా­రి­తో మా­ట్లా­డా­ల­ని పౌర సర­ఫ­రాల శాఖ మం­త్రి నా­దెం­డ్ల మనో­హ­ర్ ఈ సమా­వే­శం­లో సూ­చిం­చా­రు. ఈ సూ­చ­న­పై సీఎం చం­ద్ర­బా­బు సా­ను­కూ­లం­గా స్పం­దిం­చా­రు. ఆటో డ్రై­వ­ర్ల­ను వెం­ట­నే పి­లి­పిం­చి వా­రి­తో సమా­వే­శం ఏర్పా­టు చే­యా­ల­ని అధి­కా­రు­ల­కు సీఎం ఆదే­శిం­చా­రు. వా­రి­తో మా­ట్లా­డి తగిన సహా­యం చే­యా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు ఈ సం­ద­ర్భం­గా సూ­చిం­చా­రు. ఆగ­స్ట్ 15వ తేదీ.. స్వా­తం­త్ర ది­నో­త్స­వ­మ­ని.. ఆ రోజు చాలా కా­ర్య­క్ర­మా­లు ఉం­టా­య­ని ఈ సం­ద­ర్భం­గా సీఎం చం­ద్ర­బా­బు­కు మం­త్రు­లు వి­న్న­విం­చా­రు. కానీ టైమ్ అడ్జె­ట్‌ చే­సు­కు­ని ఈ కా­ర్య­క్ర­మా­ని­కి తప్ప­కుం­డా హా­జ­రు­కా­వా­ల­ని వా­రి­కి సీఎం సూ­చిం­చా­రు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ప్రతీ ఒక్కరికి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News