Andhra Pradesh: అమరావతి పనులను ప్రారంభించిన చంద్రబాబు
సీఆర్డీఏ కార్యాలయం వద్ద పనులను పునఃప్రారంభించిన సీఏం;
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. సీఆర్డీఏ పనుల ద్వారా రాజధాని పనులను ఆయన ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో రూ. 160 కోట్లతో ఎనిమిది అంతస్తుల సీఆర్డీఏ కార్యాలయ పనులను ప్రారంభించారు. ఆ పనులు మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు సీఆర్డీఏ కార్యాలయం నుంచే పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం వద్ద పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడ చంద్రబాబు పూజలు నిర్వహించారు. మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అదనంగా ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ కు 2.51 ఎకరాలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ బిల్డింగ్ లో ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ పనులు పెండింగ్ లో ఉన్నాయి.
మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అదనంగా ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ కు 2.51 ఎకరాలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. చరిత్రను తిరగరాయడానికి ఇక్కడ అందరం సమావేశం అయ్యామన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడ్డారని తెలిపారు.
హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత తమదేనని తెలిపారు. ముందు చూపుతో ఆలోచించి సైబరాబాద్లో 8 వరుసల్లో రోడ్లు వేశామన్నారు. అప్పుడు శంషాబాద్ విమానాశ్రయానికి 5 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. చాలా మంది అడ్డు పడ్డారు. ఏదైనా మంచి పనిచేస్తే అడ్డు పడేవారు ఎక్కడైనా ఉంటారని తెలిపారు. రైతులను ఒప్పించి రాజధాని కోసం భూములను సేకరించాం. మొత్తం 54 ఎకరాలను అమరావతి కోసం సేకరించామని తప్పకుండా రాజధాని కట్టి తీరుతామని చంద్రబాబు అన్నారు.
ప్రపంచంలో టాప్ 5 సిటీలలో అమరావతిని ఒకటిగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్యెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కూడా హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పరిపాలన సరిగ్గా చేయలేదని, పోలీసుల పరిపాలన చేసిందన్నారు.