ఉన్మాదానికి సరైన గుణపాఠం ప్రజలే చెప్పాలి - చంద్రబాబు

Update: 2020-11-24 11:09 GMT

వైసీపీ బాధితులంతా ఏకం కావాలని... నిరంకుశ పాలనపై సంఘటితంగా పోరాడాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఉన్మాదానికి సరైన గుణపాఠం ప్రజలే చెబుతారన్నారు. అమరావతి టీడీపీ మండల కమిటి నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లీం మైనార్టీలలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రజలు తిరుగబడితే వైసీపీ డబ్బులు పనిచేయ వన్నారు. తిరుపతి ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. 

Tags:    

Similar News