AP : సీఎం చంద్రబాబు, కలెక్టర్ల రివ్యూకు సన్నాహాలు

Update: 2024-08-02 09:27 GMT

ఈనెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లండించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో సిసిఎల్పీ జి.జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. తొలి రోజు కలెక్టర్ల తోను, రెండవ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్టు సిసోడియా చెప్పారు.

రెండు రోజుల్లోను ఉదయం 10గం.ల నుండి సా. 6గం.ల వరకూ సమావేశం ఉంటుంది. ఈసమావేశానికి హాజరయ్యే కలెక్టర్లు, ఎస్పీలకు తగిన రవాణా, వసతి వంటి ఏర్పాట్లు చూడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనను ఆదేశించారు. సమావేశం నిర్వహణకు అవసరమైన వివిధ సహాయ సిబ్బందిని సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. అదే విధంగా భద్రత, అగ్నిమాపక సంబంధిత భద్రతా చర్యలను గుంటూరు రేంజి ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి, సచివాలయ ఎస్పిఎఫ్ అధికారులు చూడాలని చెప్పారు.

ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులకు ఆహ్వానాలు పంపే ఏర్పాట్లను సాధారణ పరిపాలన శాఖ చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా చెప్పారు. అదే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆడియో వీడియో సిస్టమ్, మీడియా కవరేజ్, మినిట్స్ రికార్డు వంటి అంశాలకు సంబంధించి ఐటి అండ్ సి,ప్రణాళిక, ఐ అండ్ పిఆర్, ఆ విభాగాల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సిసోడియా ఆదేశించారు.

Tags:    

Similar News