సీఎం చంద్రబాబు వచ్చేవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన టైమ్ షెడ్యూల్ను విడుదల చేస్తారని తెలిపారు. జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు మొదలవుతాయన్నారు. దానికి సమాంతరంగా ఎర్త్ కం రాక్ ఫిల్లింగ్ పనులు కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలవరం పర్యటన సందర్భంగా సీఎం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి -టైం షెడ్యూల్ ను కూడా విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. జనవరి నుంచి డయా ఫ్రం వాల్ పనులు ప్రారంభం కానున్నాయి. డయాఫ్రం వాల్ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఎర్త్ కం రాక్ ఫిల్లింగ్ (ఈసీఆర్ఎఫ్) పనులు కూడా చేపట్టాల్సి ఉంది. త్వరలోనే సహాయ, పునరావాసం (ఆర్అండ్ఆర్)తో పాటు భూసేకరణ పనులు కూడా పున:ప్రారంభించి వేగవంతం చేయాలి. షెడ్యూల్ ప్రకారం ఒక్క గంట కూడా వృధా కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి నిమ్మల దిశా నిర్దేశం చేశారు.