AP: ఏపీ మంత్రులకు డేంజర్ బెల్స్

సీఎం చంద్రబాబు హెచ్చరికలతో మంత్రివర్గంలో కలకలం;

Update: 2025-07-12 02:30 GMT

ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు.. మం­త్రి­వ­ర్గ సహ­చ­రు­ల­కు కా­స్త గట్టి­గా­నే హె­చ్చ­రి­క­లు చే­య­డం ఇప్పు­డు చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. చం­ద్ర­బా­బు హె­చ్చ­రి­క­ల­తో మం­త్రి పద­వు­ల­కు తు­ది­ఘ­డి­య­లు సమీ­పిం­చి­న­ట్లే­న­ని అను­కో­వా­లి. కూ­ట­మి ప్ర­భు­త్వం ఏర్పా­ట­యిన వెం­ట­నే సీ­ని­య­ర్లు, జూ­ని­య­ర్ల­తో మం­త్రి­వ­ర్గా­న్ని ఏర్పా­టు చే­శా­రు. ఇం­దు­లో ము­గ్గు­రు జన­సేన, ఒక్క­రు బీ­జే­పీ మం­త్రు­ల­ను తీసి పక్కన పె­డి­తే మి­గి­లిన టీ­డీ­పీ మం­త్రు­ల్లో చాలా మం­ది­ని సా­మా­జి­క­వ­ర్గం­తో పాటు యువత అని భా­విం­చి తీ­సు­కు­న్నా­రు. యువత అయి­తే తనతో పాటు సమా­నం­గా వే­గం­గా పరు­గు­లు పె­డ­తా­ర­ని భా­విం­చా­రు. అయి­తే కూ­ట­మి­లో మం­త్రుల పని­తీ­రు మీద ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అసం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­రు. తా­జా­గా జరి­గిన మం­త్రి­వ­ర్గ సమా­వే­శం­లో కూడా మం­త్రు­ల­కు క్లా­స్ తీ­సు­కు­న్నా­ర­ని ప్ర­చా­రం సా­గు­తోం­ది. కొ­త్త­గా మం­త్రు­లు రా­వ­చ్చు అని కూ­ట­మి నుం­చి వి­ని­పి­స్తోం­ది. కొం­ద­రు కే­బి­నె­ట్ లో ఇన్ అయి­తే మరి కొం­ద­రు అవు­ట్ అవడం ఖా­య­మ­ని అం­టు­న్నా­రు. పా­తిక మం­ది­కే కే­బి­నె­ట్ లో చోటు ఉం­టుం­ది. అం­దు­లో జన­సే­న­కు ఒక బె­ర్త్ ని ఇస్తే టీ­డీ­పీ నుం­చి ము­గ్గు­రు నలు­గు­రు­కి చా­న్స్ ఇస్తా­ర­ని ఊహా­గా­నా­లు అయి­తే వి­ని­పి­స్తు­న్నా­యి. ఇది­లా ఉంటే ఉత్త­రాం­ధ్రా జి­ల్లాల నుం­చి ఒక­రి­ద్ద­రి మం­త్రుల వి­ష­యం­లో చూ­స్తే కనుక డేం­జ­ర్ బె­ల్స్ మో­గు­తు­న్నా­య­ని అం­టు­న్నా­రు. కీ­ల­క­మైన శా­ఖ­ను ని­ర్వ­హి­స్తు­న్న వారి మీద ఆరో­ప­ణ­లు వస్తు­న్నా­య­ని అను­కూల మీ­డి­యా­లో­నే వా­ర్త­లు వస్తూం­డ­డం­తో తప్పి­స్తా­రా అన్న చర్చ సా­గు­తోం­ది.

 మార్పు తప్పదా..?

జన­సే­న­కు ఒక మం­త్రి పదవి అంటే వి­శాఖ జి­ల్లా నుం­చి సీ­ని­య­ర్ నేత ఒక­రి­కి చా­న్స్ రా­వ­చ్చు అని అం­టు­న్నా­రు. అదే వి­ధం­గా వి­శాఖ నగ­రా­ని­కి మం­త్రి­వ­ర్గం­లో ప్రా­ధా­న్యత లే­కుం­డా ఉంది. దాం­తో ఈసా­రి కచ్చి­తం­గా చా­న్స్ ఇస్తా­ర­ని చె­బు­తు­న్నా­రు. అది కచ్చి­తం­గా టీ­డీ­పీ­కి చెం­దిన వా­రి­కే దక్కు­తుం­ద­ని అం­టు­న్నా­రు. ఆ అదృ­ష్ట­వం­తు­లు ఎవరు అన్న­దే అంతా ఆలో­చి­స్తు­న్నా­రుట. తె­లు­గు­దే­శం పా­ర్టీ వి­ష­యా­ని­కి వస్తే వి­శాఖ సిటీ కం­చు­కో­ట­గా ఉంది. అయి­తే మం­త్రి లే­క­పో­వ­డం­తో రా­జ­కీ­యం­గా కొంత ఇబ్బం­ది­గా మా­రిం­ద­ని అం­టు­న్నా­రు. వి­శాఖ జి­ల్లా­ను అంతా కలి­పి ఉం­చ­డం రా­జ­కీ­యం­గా దూ­కు­డు పెం­చ­డం వం­టి­వి చే­యా­లం­టే మం­త్రి­ని సిటీ నుం­చే ఎం­పిక చే­యా­ల­ని అం­టు­న్నా­రు. మం­త్రి వర్గ వి­స్త­రణ కానీ మా­ర్పు­లు కానీ ఉంటే కనుక వి­శాఖ­కి ప్రా­ధా­న్యత ఉం­డొ­చ్చు­టు­న్నా­రు. ఈ పు­కా­ర్ల వెనక ని­జా­లు ఏమి­టి అన్న­ది కొం­త­కా­లం ఆగి­తే తప్ప తె­లి­య­దు అన్న­ది రా­జ­కీయ వర్గా­ల­లో సా­గు­తు­న్న చర్చ­గా ఉంది.

 50 మంది ఎమ్మెల్యేలు గెలవరా..?

ఏపీ­లో కూ­ట­మి సర్కా­ర్ ఏడా­ది పాలన పూ­ర్తి చే­సు­కు­న్న నే­ప­థ్యం­లో ప్ర­భు­త్వ పని­తీ­రు­పై పలు సర్వే­లు వె­లు­వ­డ్డా­యి. ఇం­దు­లో దా­దా­పు 40-50 మంది ఎమ్మె­ల్యే­లు తి­రి­గి గె­ల­వ­డం కష్ట­మ­నే అం­చ­నా­లు వచ్చా­యి. అలా­గే మం­త్రుల పని­తీ­రు­పై­నా ఇం­దు­లో ప్ర­త్యేక ప్ర­స్తా­వ­న­లు వచ్చా­యి. పలు­వు­రు మం­త్రు­లు సైతం ఈ సర్వే­ల్లో రెడ్ జోన్ లో కని­పిం­చా­రు. ఈ నే­ప­థ్యం­లో తా­జా­గా జరి­గిన కే­బి­నె­ట్ భే­టీ­లో మం­త్రుల పని­తీ­రు­పై సీఎం చం­ద్ర­బా­బు ఎన్న­డూ లే­నం­త­గా తీ­వ్ర అసం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­రు. పలు­వు­రు మం­త్రు­లు సైతం ఈ సర్వే­ల్లో రెడ్ జోన్ లో కని­పిం­చా­రు. ఈ నే­ప­థ్యం­లో తా­జా­గా జరి­గిన కే­బి­నె­ట్ భే­టీ­లో మం­త్రుల పని­తీ­రు­పై సీఎం చం­ద్ర­బా­బు ఎన్న­డూ లే­నం­త­గా తీ­వ్ర అసం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­రు. అం­చ­నా­ల­కు తగి­న­ట్లు­గా పని­చే­య­ని మం­త్రు­ల­పై వేటు తప్ప­ద­నే సం­కే­తా­ల్ని సీఎం చం­ద్ర­బా­బు తా­జా­గా జరి­గిన కే­బి­నె­ట్ భే­టీ­లో­నే ఇచ్చే­శా­రు. ఈ నే­ప­థ్యం­లో మం­త్రి­వ­ర్గ ప్ర­క్షా­ళ­న­కు చం­ద్ర­బా­బు సి­ద్ద­మ­వు­తు­న్నా­ర­నే ప్ర­చా­రం జో­రు­గా సా­గు­తోం­ది.

Tags:    

Similar News