Tirupati: కిలాడి లేడీ ఘరానా మోసం.. ప్రసాదంలో మత్తు మందు కలిపి

Tirupati: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ కిలాడి లేడీ ఘరానా మోసం ఆలస్యంగా బయటపడింది.

Update: 2022-12-12 06:48 GMT

Tirupati: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ కిలాడి లేడీ ఘరానా మోసం ఆలస్యంగా బయటపడింది. బస్సులో పరిచయమైన భక్తున్ని లాడ్జికి తీసుకెళ్లిన మహిళ...ప్రసాదంలో మత్తు మందు కలిపి మోసం చేసింది. భక్తుడి నుంచి 15 సవర్ల బంగారం, 20 వేల నగదు, సెల్‌ఫోన్‌ దొంగిలించి పరారైంది. చోరీకి గురైన మొత్తం సొత్తు విలువ 6 లక్షల రూపాయలుగా తెలుస్తోంది. బాధితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఐతే ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Tags:    

Similar News