జనసేనానికి పాలాభిషేకం చేసిన రైతులు, మహిళలు

Update: 2020-09-22 08:58 GMT

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఉద్దండరాయుని పాలెం గ్రామ రైతులు, మహిళలు పాలాభిషేకం చేశారు. మూడు రాజధానులు అంటే నమ్మక ద్రోహమే అని పవన్‌ చేసిన వ్యాఖ్యలకు సంఘీభావంగా పాలభిషేకం నిర్వహించారు. అమరావతి కోసం పవన్‌ ముందుకు వచ్చి పోరాడాలి అని వారు విజ్ఞప్తి చేశారు. రోజు రోజుకూ తమకు అన్ని పార్టీల నుంచి మద్దతు పెరుగుతోందని.. అమరావతికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని రైతులు అన్నారు.  

Tags:    

Similar News