Kadapa Central Jail : కడప సెంట్రల్ జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

Update: 2025-07-22 05:34 GMT

కడప సెంట్రల్ జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. - జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తో పాటు మరో ముగ్గురు జైలు వార్డర్లపైనా సస్పెన్షన్ వేటు పడింది. - ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేశారనే ఆరోపణలతో సస్పెన్షన్ -వేశారు ఉన్నాతాధికారులు. ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందజేసినట్లుగా సిబ్బందిపై ఆరోపణలున్నాయి. దీనిపై - 4 రోజులపాటు డీఐజీ రవికిరణ్ విచారణ జరిపారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది.

Tags:    

Similar News