భద్రాచలం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
ఆదివారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 44 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసింది. సోమవారం ఉదయం 46 అడుగుల వద్ద ప్రవహించింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 48 అడుగులు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఎగువన ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నది ఉగ్రరూపం దాల్చింది.
సాయంత్రం నాటికి నదీ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.