Ramayya Brahmotsavam : ఒంటిమిట్టలో వైభవంగా రామయ్య బ్రహ్మోత్సవాలు

Update: 2025-04-07 13:15 GMT

ఆంధ్రప్రదేశ్ భద్రాద్రి కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండ రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు వేణు గాన అలంకారంలో పురవీధుల్లో సీతా లక్ష్మణ సమేత శ్రీ రాముడు ఊరేగారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరిగింది. భక్త జన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. 

Tags:    

Similar News