రఘురామకృష్ణ రాజు పిటిషన్పై హైకోర్టు తీర్పు రేపటికి వాయిదా
జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది.;
జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని రఘురామ హైకోర్టును కోరారు. పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. అటు జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై రేపు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది.