ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుచేయాలంటూ కేఏ పాల్ దీక్ష..!

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుచేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖలో దీక్షకు దిగారు. పరీక్షలను రద్దుచేయాలంటూ ఆయన ఇప్పటికే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Update: 2021-04-29 07:30 GMT

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుచేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖలో దీక్షకు దిగారు. పరీక్షలను రద్దుచేయాలంటూ ఆయన ఇప్పటికే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పరీక్షలు పెట్టడం వల్ల రాష్ట్రంలోని 35లక్షల మంది విద్యార్ధులకు కోవిడ్ సోకే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. విద్యార్ధి లోకానికి మేలు జరిగే వరకు తన దీక్ష కొనసాగుతుందన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు కరోనాను క్యాష్‌ చేసుకుంటున్నాయని పాల్ దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులను టేక్ ఓవర్ చేసుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News