kanakamedala ravindra kumar: ఏపీ దిక్కులేని, రాజధాని లేని రాష్ట్రం అయింది: కనకమేడల

kanakamedala ravindra kumar: ఏపీ పరువును పార్లమెంట్‌ సాక్షిగా వైసీపీ ఎంపీలే తీశారని కనక మేడల అన్నారు.

Update: 2021-12-02 09:30 GMT

AP Kanaka Medala Ravindrakumar: ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు, రైల్వే జోన్‌పై పార్లమెంట్‌లో పోరాటం చేస్తామన్న వైసీపీ ఎంపీలు.. నోరు ఎందుకు మెదపడం లేదని టీడీపీ ఎంపీలు కనకమేడల రవీందర్‌ కుమార్‌, రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నించారు. జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏపీలో ఉందని రాష్ట్ర పరువును పార్లమెంట్‌ సాక్షిగా వైసీపీ ఎంపీలే తీశారన్నారు కనకమేడల. జగన్‌ ప్రభుత్వం 3లక్షలకు పైగా అప్పు చేసి ఏపీ ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించార్నారు. కేసుల కోసం ఏపీ ప్రయోజనాలను జగన్‌ తాకట్టు పెడుతున్నారని రామ్మోహన్‌ నాయుడు దుయ్యబట్టారు.

Tags:    

Similar News