అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టెన యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, శ్రీనివాసరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదే శాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం కొమ్మి నేనిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
ప్రముఖ టీవీ ఛానల్లో కొమ్మినేని నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అమరావతి మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను కొమ్మినేని సమర్థించినట్లు ఆరో పణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కొమ్మినేనితో పాటు మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజు కూడా నిందితుడిగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఐటీ చట్టం కింద నాన్-బెయిలబుల్ సెక్షన్లలో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సాక్షియాజ మాన్యంపై కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాస్ ను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. అనంతరం గుంటూరు కు తరలించిన పోలీసులు.. రాత్రి నల్లపాడు పోలీస్టేషన్లో విచారణ జరిపారు. ఆపై మంగళవారం ఉదయం గుంటూరు జీజీహెచ్లో కొమ్మినేనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.