LOCAL WAR: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు

సర్పంచ్ ఎన్నికల్లో హస్తం సత్తా... మూడు దశల్లోనూ సాధికార విజయాలు... పర్వాలేదనిపించిన గులాబీ పార్టీ

Update: 2025-12-18 04:30 GMT

పం­చా­య­తీ ఎన్ని­క­ల్లో అధి­కార కాం­గ్రె­స్‌ పా­ర్టీ హవా కొ­న­సా­గిం­ది. తొలి రెం­డు వి­డ­త­ల్లో మె­జా­రి­టీ స్థా­నా­ల­ను కై­వ­సం చే­సు­కు­న్న హస్తం పా­ర్టీ.. మూడు వి­డ­త­లో­నూ అదే జోరు కొ­న­సా­గిం­చిం­ది. రా­ష్ట్రం­లో అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత క్షే­త్ర­స్థా­యి­లో కాం­గ్రె­స్‌ పా­ర్టీ దశ మా­రి­పో­యిం­ది. బీ­ఆ­ర్‌­ఎ­స్‌ అధి­కా­రం­లో ఉన్న­ప్పు­డు కాం­గ్రె­స్‌ పా­ర్టీ స్థా­నిక ఎన్ని­క­ల్లో డీలా పడిన సం­గ­తి తె­లి­సిం­దే. గె­లి­చిన అభ్య­ర్థు­లు కూడా రా­త్రి­కి రా­త్రే బీ­ఆ­ర్‌­ఎ­స్‌ కం­డు­వా­లు కప్పే­సు­కు­న్నా­రు. రా­ష్ట్రం­లో అధి­కా­రం­లో­కి రా­వ­డం­తో క్షే­త్ర­స్థా­యి­లో హస్తం పా­ర్టీ పరి­స్థి­తి మా­రి­పో­యిం­ది. తొలి, మలి, చి­వ­రి విడత ృస­ర్పం­చ్‌ ఎన్ని­క­ల్లో సగా­ని­కి­పై­గా సీ­ట్ల­లో కాం­గ్రె­స్‌ మద్ద­తు ఇచ్చిన అభ్య­ర్థు­లే గె­లి­చా­రు. జి­ల్లాల వా­రీ­గా­నూ ఈ ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్‌ పా­ర్టీ హవా కొ­న­సా­గిం­ది. స్థా­నిక ఎన్ని­క­ల­ను సీఎం రే­వం­త్‌­రె­డ్డి ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా తీ­సు­కో­వ­డం­తో మం­త్రు­లు, పా­ర్టీ ఎమ్మె­ల్యే­లు పూ­ర్తి­స్థా­యి­లో దృ­ష్టి పె­ట్టా­రు. దీం­తో సి­ద్ది­పేట, ఆసి­ఫా­బా­ద్‌, జన­గామ మి­న­హా అన్ని జి­ల్లా­ల్లో­నూ కాం­గ్రె­స్‌ పా­ర్టీ ఆధి­క్యం స్ప­ష్టం­గా కని­పిం­చిం­ది. మహ­బూ­బ్‌­న­గ­ర్‌, సం­గా­రె­డ్డి సహా 20 జి­ల్లా­ల్లో­నై­తే సగా­ని­కం­టే ఎక్కువ సీ­ట్ల­ను కాం­గ్రె­స్‌ గె­లు­చు­కుం­ది. ఏక­గ్రీ­వ­మైన 415 పం­చా­య­తీ­ల్లో 90 శా­తా­ని­కి­పై­గా కాం­గ్రె్‌­స­వే కా­వ­డం వి­శే­షం. మలి విడత ఎన్ని­కల ఫలి­తా­ల్లో­నూ కాం­గ్రె­స్‌ హవా కొ­న­సా­గ­డం­తో పా­ర్టీ నే­త­ల్లో ఉత్సా­హం పె­రి­గిం­ది. ఈ ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్ఎ­స్ 25 శా­తా­ని­కి పైగా సీ­ట్ల­ను కై­వ­సం చే­సు­కో­వ­డం ఊరట కలి­గిం­చే అం­శ­మే­న­ని పా­ర్టీ వర్గా­లు చె­బు­తు­న్నా­యి. తొలి, రెం­డో, మూడో విడత సర్పం­చ్‌ ఎన్ని­క­ల్లో 25 శా­తా­ని­కి పైగా సీ­ట్లు కై­వ­సం చే­సు­కో­వ­డం ద్వా­రా క్షే­త్ర­స్థా­యి­లో ఆ పా­ర్టీ తన ఉని­కి­ని చా­టు­కుం­ద­ని, ప్ర­స్తుత పరి­స్థి­తు­ల్లో ఇది బీ­ఆ­ర్‌­ఎ్‌­స­కు పె­ద్ద ఊర­టే­న­ని వి­శ్లే­ష­కు­లు చె­బు­తు­న్నా­రు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56 శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. బుధవారం మొత్తం 4,159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి(రాత్రి 12.30 గంటల వరకు) కాంగ్రెస్‌ మద్దతుదారులు 2,286  స్థానాలను గెలిచారు. భారాస 1,142, భాజపా 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సీపీఐ మద్దతుదారులు 24 చోట్ల, సీపీఎం వారు 7 చోట్ల గెలిచారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి.  ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో భారాస గెలుపొందింది. భాజపా 688 స్థానాలు పొందగా... ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు.

రా­ష్ట్రం­లో ప్ర­త్యా­మ్నా­యం­గా ఎద­గా­ల­ని చూ­స్తు న్న బీ­జే­పీ.. పం­చా­య­తీ ఎన్ని­క­ల్లో­నూ తన బలా­న్ని చూ­ప­లే­క­పో­యిం­ది. బీ­జే­పీ గె­లు­చు­కు­న్న సీ­ట్ల­లో సిం­హ­భా­గం ఆ పా­ర్టీ ఎమ్మె­ల్యే­లు ప్రా­తి­ని­ద్యం వహి­స్తు­న్న ని­యో­జ­క­వ­ర్గా­ల­వే కా­వ­డం గమ­నా­ర్హం. అంటే ఎన్ని­క­లు జరి­గిన పం­చా­య­తీ­ల్లో బీ­జే­పీ వాటా కే­వ­లం ఆరు శాతం. కాం­గ్రె­స్లో ఉన్న పరి­స్థి­తుల వల్ల తి­రు­గు­లే­ని నే­త­గా ఎద­గ­డా­ని­కి అవ­కా­శం ఉం­డ­దు. ఎప్ప­టి­క­ప్పు­డు కా­ళ్లు, చే­తు­లు కట్టే­స్తూ­నే ఉం­టా­రు. అయి­నా రే­వం­త్ తన పట్టు ని­రూ­పిం­చు­కుం­టూ­నే ఉన్నా­రు. జా­తీయ స్థా­యి­లో కాం­గ్రె­స్ పా­ర్టీ­కి అవ­స­ర­మై­న­ప్పు­డ­ల్లా అం­డ­గా ఉన్నా­రు. ఉప­రా­ష్ట్ర­ప­తి అభ్య­ర్థి­ని సమ­కూ­ర్చా­రు. జా­తీయ రా­జ­కీ­యా­ల­కు ఆయన వ్యూ­హా­లే ది­క్సూ­చీ అయ్యా­యి.  రెం­డే­ళ్ల­లో రెం­డు అసెం­బ్లీ స్థా­నా­ల­కు ఉపఎ­న్ని­క­లు జరి­గా­యి. రెం­డిం­టి­ని కాం­గ్రె­స్ ఖా­తా­లో వే­సు­కు­ని ఎమ్మె­ల్యేల  సం­ఖ్య­ పెం­చు­కుంది.

Tags:    

Similar News