Lokesh Padayatra: భారతి కెచప్.. పాదయాత్రలో లోకేష్ సెటైర్లు..

Lokesh Padayatra:

Update: 2023-01-30 08:48 GMT

Lokesh Padayatra: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం మునుపెన్నడూ లేని విధంగా సాగుతున్న పాదయాత్ర ఈరోజు ఉదయం పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఆదివారం శాంతిపురం సండే మార్కెట్ మీదుగా సాగిన లోకేష్ పాదయాత్రలో రైతులతో ముచ్చటించారు.

అనంతరం, టమాటా రైతులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన కెచప్ ఫ్యాక్టరీ హామీని తుంగలో తొక్కారు. "ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్ తన ప్రభుత్వం టమాటా రైతుల భవిష్యత్తును మార్చే కెచప్ ఫ్యాక్టరీని స్థాపిస్తుందని వాగ్దానం చేశారు. మరి ఆ కెచప్ ఫ్యాక్టరీ ఊసేది.. ఏమైంది వాగ్ధానం? బహుశా జగన్ ఇంకా ఫ్యాక్టరీకి తగిన పేరు కోసం వెతుకుతున్నారేమో, 'భారతి (జగన్ భార్య) కెచప్' పేరు బాగానే ఉంది కదా" అని లోకేష్ సెటైరిక్‌గా అన్నారు.

'భారతి కెచప్' విని లోకేష్ వెంట ఉన్న ప్రజలు, రైతులు పెద్దగా నవ్వారు. వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు, విద్యాసంస్థలు తదితర వాటికి జగన్‌, వైఎస్‌ఆర్‌ పేర్లను పెట్టడంతో లోకేష్‌ చేసిన ఈ వ్యాఖ్య వైరల్‌గా మారింది.

Tags:    

Similar News