MEET: ఢిల్లీ వేదికగా అరుదైన చర్చలు.. ఆకట్టుకునే చిత్రాలు

Update: 2025-07-17 02:30 GMT

తె­లు­గు రా­ష్ట్రాల ము­ఖ్య­మం­త్రు­లు చం­ద్ర­బా­బు నా­యు­డు, రే­వం­త్ రె­డ్డి ఢి­ల్లీ­లో కేం­ద్ర జల­శ­క్తి సమా­వే­శం­లో పా­ల్గొ­ని కీలక చర్చ­లు జరి­పా­రు,. రే­వం­త్ రె­డ్డి తె­లం­గాణ సీఎం అయ్యాక ఏపీ ఎన్ని­క­ల్లో గె­లి­చి చం­ద్ర­బా­బు ఇక్కడ సీఎం అయ్యా­రు. అనం­త­రం వీ­రి­ద్ద­రూ నే­రు­గా కలి­సి చర్చ­లు జరు­పు­కు­న్న సం­ద­ర్భా­లు లేవు. మర్యా­ద­పూ­ర్వక భే­టీ­లు మా­త్ర­మే జరి­గా­యి. ఈ మధ్య బన­క­చ­ర్ల ప్రా­జె­క్టు వి­వా­దం తర్వాత వీ­రి­ద్ద­రి మధ్య మాటల యు­ద్ధం కూడా సా­గిం­ది. ఈ నే­ప­థ్యం­లో తె­లు­గు రా­ష్ట్రాల ము­ఖ్య­మం­త్రు­లు ఒకే వే­ది­క­పై కని­పిం­చ­డం ఆస­క్తి­ని రే­పిం­ది. కేం­ద్ర జల్ శక్తి శాఖ మం­త్రి సీ­ఆ­ర్ పా­టి­ల్ ను కలి­సేం­దు­కు ఏపీ, తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రు­ల­తో పాటు ఇం­జ­నీ­ర్ల బృం­దం ఢి­ల్లీ వె­ళ్లిం­ది. ఈ సం­ద­ర్భం­గా ఢి­ల్లీ­లో­ని జల­శ­క్తి­శాఖ కా­ర్యా­ల­యం­లో ఇరు­రా­ష్ట్రాల సీ­ఎం­ల­తో మం­త్రి సీ­ఆ­ర్ పా­టి­ల్ భేటీ అయ్యా­రు. చం­ద్ర­బా­బు, రే­వం­త్‌­రె­డ్డి­తో కేం­ద్ర­మం­త్రి సీ­ఆ­ర్ పా­టి­ల్ సమా­వే­శ­మై కీలక వి­ష­యా­ల­పై చర్చిం­చా­రు.


ఈ భే­టీ­లో ఇరు­రా­ష్ట్రాల నీ­టి­పా­రు­ద­ల­శాఖ మం­త్రు­లు ని­మ్మల రా­మా­నా­యు­డు, ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి పా­ల్గొ­న్నా­రు. అలా­గే ఇరు రా­ష్ట్రాల సీ­ఎ­స్‌­లు, నీ­టి­పా­రు­ద­ల­శాఖ కా­ర్య­ద­ర్శు­లు, ఇం­జి­నీ­ర్లు కూడా ఇం­దు­లో ఉన్నా­రు. ఈ సం­ద­ర్భం­గా ఇరు­వు­రు ము­ఖ్య­మం­త్రు­లు ఒక­రి­ని ఒకరు సత్క­రిం­చు­కు­న్నా­రు. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి­తో చం­ద్ర­బా­బు కా­సే­పు చర్చిం­చా­రు. మరో­వై­పు "బన­క­చ­ర్ల ప్రా­జె­క్టు అనే­ది ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని నదుల అను­సం­ధా­నా­ని­కి, నీటి మళ్లిం­పు­కు సం­బం­ధిం­చిన అంశం మా­త్ర­మే. ఇది గో­దా­వ­రి జలా­ల­కు కాదు, రెం­డు రా­ష్ట్రాల నీటి కే­టా­యిం­పు­ల­కు కా­దు­సం­బం­ధిం­చిన అంశం. ఇది ఏపీ అం­త­ర్గత వ్య­వ­హా­రం తప్ప ఇరు రా­ష్ట్రా­లు చర్చిం­చే అంశం కాదు." అని జల­శ­క్తి శా­ఖ­కు తె­లం­గాణ ప్ర­భు­త్వం ఇప్ప­టి­కే లేఖ రా­సిం­ది. జల­శ­క్తి నే­తృ­త్వం­లో జరి­గిన చర్చ­ల్లో­నూ ఏకా­భి­ప్రా­యం రా­లే­దు.



Tags:    

Similar News