AP : పార్క్ పేరుతో పేర్నినాని తిన్నదంతా కక్కిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

Update: 2024-08-02 09:34 GMT

పార్కు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) అన్నారు. మచిలీపట్నంలో యర్రా నాగేశ్వరరావు పేరుతో పార్కు ఏర్పాటుపై వచ్చిన కథనాలపై మీడియాతో మాట్లాడారు. "ఈ పార్కు విషయంలో జరిగిన అక్రమాలన్నింటిపైనా విచారణ జరిపిస్తాం. ఎంత ఖర్చు చేశారో, ఎంత తిన్నారో మొత్తం బయటకు లాగుతాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమాల గుట్టు బయటపెడతాం" అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో పార్కు ఉండగా.. బలవంతంగా నాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తన తండ్రి పేరు పెట్టుకోవడాన్ని ఆక్షేపించారు. "నియోజకవర్గానికి అతను చేసిన సేవలేమీ లేకపోయినా, నాటి ఎమ్మెల్యే పేర్ని నాని, శ్రీలక్ష్మి కలిసి పేరు మార్చేశారు. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ నిధుల నుండి రూ.2 కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన రూ.18 లక్షలు ఖర్చు చేయడం దుర్మార్గం.. తండ్రి విగ్రహం పెట్టాలనే ఆలోచన ఉంటే సొంత ఖర్చుతో పెట్టుకోవాలని గతంలోనే చెప్పాం. ఏకపక్షంగా వ్యవహరించారు. గతంలో మచిలీపట్నం పరిధిలో తెలుగుదేశం ప్రభుత్వం పలు పార్కుల్ని అభివృద్ధి చేసింది. వాటిని తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం నీరుగార్చింది" అని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Tags:    

Similar News