అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి సిదిరి అప్పల రాజు

Update: 2020-10-05 05:11 GMT

అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ మంత్రి సిదిరి అప్పల రాజు. అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లిన వారు..... రైతులు ఎలా అవుతారంటూ ప్రశ్నించారాయన. అమరావతి రైతులు ముమ్మాటికీ పెయిడ్‌ ఆర్టిస్టులేనని మరోసారి అవమానించారు. టీడీపీ అధినేతపై.... మంత్రి కృష్ణదాసు వాఖ్యల నేపథ్యంలో... టీడీపీ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి అప్పలరాజు... ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత కూన రవికుమార్‌ను టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 

Tags:    

Similar News