AP : మన ఇంటికి మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మన ఇంటికి మన ప్రభుత్వ కార్యక్రమం తో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పిలుపుతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ లోని 25 వ వార్డు కాంపాళం లో నేడు మన ఇంటికి మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. కమిషనర్ వెంకటరామిరెడ్డి.
ఆయన ప్రభుత్వ అధికారులతో ప్రతి ఇంటింటికీ వెళ్లి ప్రజల ప్రజా సమస్యలు మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాల సమస్యలపై ప్రజలు తో అడిగి తెలుసుకున్నారు.
ఏడాది కూటమి ప్రభుత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రధానంగా ఈ 25 వ వార్డు దళితివాడ ప్రాంతంలో మహిళలు త్రాగునీరు, తల్లికి వందనం,నూతన పెన్షన్లు, ఇల్లు మంజూరు , డ్రైనేజీ, డ్రైనేజీ వ్యవస్థ, సమస్యలపై ఎమ్మెల్యే రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు.
ఆ ప్రాంతంలో దళిత మహిళలు తల్లికి వందనం తమ బిడ్డలకు రాలేదని ఆవేదనతో ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
మరి కొందరు మహిళలు పెన్షన్లు తాగునీరు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని ఆ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే ను కోరారు.
ఆయన అధికారులతో మాట్లాడి సుమారు 15 రోజుల్లో త్రాగునీరు తల్లికి వందనం పథకం, విద్యార్థుల పిల్లలకు తమ తల్లి అకౌంట్లో జూలై 5వ తేదీ లోపు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కూటమి నాయకులు స్థానిక టిడిపి లీడర్లు పాల్గొన్నారు.