అచ్చెన్నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

టీడీపీ నేతలను మాత్రం అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ హింసా రాజకీయాలు ఎంత వరకు అని ప్రశ్నించారు.

Update: 2021-02-02 05:26 GMT

నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్టును ఎంపీ రామ్మోహన్‌ నాయుడు తీవ్రంగా ఖండించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తుంటే స్పందించని పోలీసులు.. టీడీపీ నేతలను మాత్రం అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ హింసా రాజకీయాలు ఎంత వరకు అని ప్రశ్నించారు. ప్రజల్లో కింజారపు కుటుంబానికి ఉన్న ఆదరణను జీర్ణించుకోలేక వైసీపీ ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందని రామ్మోహన్‌ నాయుడు మండిపడ్డారు.

Tags:    

Similar News