జగన్‌ పాలనలో ఎక్కవగా నష్టపోయింది రెడ్డి సోదరులే.. లోకేష్‌

యువగళం పాయాదయాత్రలో భాగంగా కడప బిల్టప్‌ సర్కిల్‌లో రెడ్డి సామాజికవర్గీయులతో ముఖాముఖిలో పాల్గొన్న లోకేష్‌

Update: 2023-06-06 13:15 GMT

జగన్‌ పాలనలో ఎక్కవగా నష్టపోయింది రెడ్డి సోదరులేనని నారా లోకేష్‌ అన్నారు. యువగళం పాయాదయాత్రలో భాగంగా కడప బిల్టప్‌ సర్కిల్‌లో రెడ్డి సామాజికవర్గీయులతో ముఖాముఖిలో పాల్గొన్న లోకేష్‌.. రెడ్డి సామాజికవర్గం మొత్తం జగన్ చేతిలో మోసపోయిందన్నారు. వైసీపీ పాలనలో కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని చెప్పారు. టీడీపీ మాత్రమే రెడ్డి సామాజికవర్గానికి గౌరవం ఇచ్చిందని.. 2014 నుంచి 19 వరకు రెడ్లకు ఎన్నో ముఖ్య పదవులు ఇచ్చామన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రెడ్డి సామాజికవర్గాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు లోకేష్‌.

Tags:    

Similar News