ఏపీలో పెరుగుతున్న కొవిడ్ కేసులు..గడిచిన 24 గంటల్లో..
Covid Cases in AP: ఏపీలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లి పెరిపోతున్నాయి.;
ఏపీలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లి పెరిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,050 కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న 85,283 పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 19,82,308 మంది వైరస్ బారినపడినట్లు తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,458 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,48,828కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,949 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,51,93,429 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,531కి చేరింది.