కడప సెంట్రల్ జైల్ నుంచి పరిటాల రవి హత్య కేసు నిందితులు విడుదలయ్యారు. వీరు 18 ఏళ్లుగా కడప సెంట్రల్ జైలులో ఖైదీలుగా ఉన్నారు. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. దీంతో ఉదయం కటప సెంట్రల్ జైలుకు ఆర్డర్ కాపీ చేరింది. జైలు నుంచి విడుదలైన వారిలో ఏ3 పండు నారాయణరెడ్డి, A4 రేఖయ్య, A5 రంగనాయకులు, A6 వడ్డే కొండ, A8 ఓబిరెడ్డి ఉన్నారు.