Pawan Kalyan: ఏపీ పదో తరగతి ఫలితాలపై స్పందించిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: ఏపీలో పదో తరగతి ఫలితాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది.

Update: 2022-06-08 13:00 GMT

Pawan Kalyan: ఏపీలో పదో తరగతి ఫలితాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వ విధానాల వల్లే చాలా మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని విపక్షలు మండిపడుతున్నాయి. తాజాగా ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే విద్యార్థులు నష్టపోయారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా రాలేదన్న పవన్‌.. అరకొర ఉన్న ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర క్యూ లైన్ల నిర్వహణ డ్యూటీ వేశారని మండిపడ్డారు. వీటి వల్ల విద్యార్థులు పాఠాలు చెప్పే సమయం లేకుండా పోయింది.. ఆ పాపమే ఈనాటి ఫలితాలకు కారణమన్నారు.

Tags:    

Similar News