ఏపీలో శాంతి భద్రతలు కనుమరుగైపోయాయన్నారు టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా. ఓట్లేసిన మైనార్టీ వర్గాలపైనే వరుస దాడులు చేస్తున్నారని ఆరోపించారు. షహిదాబేగంపై అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు.. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మైనారిటీ బిడ్డలంటే ప్రభుత్వానికి అంత నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. వరుస దాడులపై మైనార్టీలంతా ఆలోచన చేయాలన్నారు నాగుల్ మీరా.