PRAKASHRAJ: నేను ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదు

ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్‌రాజ్... బెట్టింగ్ యాప్ కేసులో సుదీర్ఘ విచారణ.. 5 గంటల పాటు విచారించిన ఈడీ;

Update: 2025-07-31 03:00 GMT

బె­ట్టిం­గ్‌ యా­ప్స్‌ కే­సు­లో వదల బొ­మ్మా­ళీ అంటూ ఈడీ దూ­కు­డు పెం­చిం­ది. తె­లం­గాణ పో­లీ­సు­లు నమో­దు చే­సిన ఎఫ్‌­ఐ­ఆ­ర్‌ ఆధా­రం­గా ఈడీ దర్యా­ప్తు జరు­పు­తోం­ది. బె­ట్టిం­గ్ యా­ప్‌­ల­కి సం­బం­ధిం­చి మనీ­లాం­డ­రిం­గ్‌, హవా­లా లా­వా­దే­వీల ఆరో­ప­ణ­ల­పై ఈడీ ఫో­క­స్‌ చే­సిం­ది. మొ­త్తం 36 బె­ట్టిం­గ్‌ యా­ప్స్‌­కి సం­బం­ధిం­చిన ప్ర­మో­ష­న్స్‌­పై సె­ల­బ్రి­టీ­ల­పై కే­సు­లు నమో­దు చే­శా­రు తె­లం­గాణ పో­లీ­సు­లు. ఓ బె­ట్టిం­గ్‌ యాడ్ ప్ర­మో­ష­న్‌­లో ప్ర­కా­ష్‌­రా­జ్ నటిం­చ­డం­తో అత­ని­పై­నా కేసు నమో­దైం­ది. 10రో­జు­ల­క్రి­తం నో­టీ­సు­లు ఇవ్వ­డం­తో ఈరో­జు ఈడీ ముం­దు హా­జ­ర­య్యా­రు. దీ­ని­లో భా­గం­గా వి­చా­ర­ణ­కు రా­వా­లం­టూ, రానా, ప్ర­కా­ష్‌­రా­జ్‌, మం­చు­ల­క్ష్మి­కి ఈడీ నో­టీ­సు­లు జారీ చే­సిం­ది. ఈ క్ర­మం­లో నటు­డు ప్ర­కా­శ్‌ రా­జ్‌ ఈడీ ముం­దు హా­జ­ర­య్యా­రు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు.. బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరు డబ్బు సంపాదించాలని భావించవద్దని సూచించారు..

ఈడీ అధి­కా­రు­లు తాను చె­ప్పిన వి­ష­యా­లు నమో­దు చే­సు­కు­న్నా­ర­న్నా­రు.. మళ్ళీ వి­చా­ర­ణ­కు ఈడీ అధి­కా­రు­లు పి­ల­వ­లే­ద­ని వె­ల్ల­డిం­చా­రు. కాగా.. దు­బా­య్ నుం­చి ఆప­రే­ట్ అవు­తు­న్న బె­ట్టిం­గ్ యా­ప్స్‌­ను ప్ర­మో­ట్ చే­శా­రు ప్ర­కా­ష్‌­రా­జ్. సినీ ప్ర­ము­ఖు­ల­కు బె­ట్టిం­గ్ యా­ప్స్ ద్వా­రా వచ్చిన సొ­మ్ము­ను దు­బా­య్‌­లో­నే పె­ట్టు­బ­డు­లు పె­ట్టి­న­ట్లు అను­మా­ని­స్తు­న్నా­రు ఈడీ అధి­కా­రు­లు. అయి­తే, ఐదు సం­వ­త్స­రాల ఆర్థిక లా­వా­దే­వీ­ల­ను పరి­శీ­లి­స్తు­న్నా­రు. తన బ్యాం­కు స్టే­ట్‌­మెం­ట్‌­ల­ను ఈడీ­కి అం­ద­జే­శా­రు ప్ర­కా­ష్‌­రా­జ్. జం­గి­ల్ రమ్మీ ద్వా­రా భా­రీ­గా ప్ర­కా­ష్‌­రా­జ్ లా­భ­ప­డి­న­ట్లు చె­బు­తు­న్నా­రు. గతం­లో బె­ట్టిం­గ్ యా­ప్స్ ప్ర­మో­ష­న్స్‌­పై క్లా­రి­టీ ఇచ్చా­రు ప్ర­కా­ష్ రాజ్. జం­గి­ల్ రమ్మీ­తో కాం­ట్రా­క్ట్ పూ­ర్తి అయ్యాక.. మళ్లీ రె­న్యూ­వ­ల్ చే­య­లే­ద­ని.. మళ్లీ ఇం­కె­ప్పు­డు బె­ట్టిం­గ్ యా­ప్స్ ప్ర­మో­ట్ చే­య­న­ని చె­ప్పు­కొ­చ్చా­రు. తన బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లను ఇప్పటికే ఈడీకి అందజేశానని ప్రకాశ్‌రాజ్ వెల్లడించారు. "జంగిల్ రమ్మీ"అనే యాప్‌ ద్వారా తాను మంచి ఆదాయం పొందినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ఈ విషయంలో ఆయన గతంలోనే స్పష్టత ఇచ్చారు. ఆయాప్‌తో తన కాంట్రాక్ట్ పూర్తయ్యాక మళ్లీ దీన్ని రెన్యూల్ చేయలేదని,ఇకపై ఎప్పుడూ ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేయనని చెప్పారు.

Tags:    

Similar News