పరీక్షల నిర్వహణకే సీఎం జగన్ మొగ్గు చూపడంపై వైసీపీ ఎంపీ రఘురామ ఆగ్రహం

ఏపీలో కరోనా విజృంభిస్తున్నా పరీక్షల నిర్వహణకే సీఎం జగన్ రెడ్డి మొగ్గు చూపడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Update: 2021-04-25 10:00 GMT

ఏపీలో కరోనా విజృంభిస్తున్నా పరీక్షల నిర్వహణకే సీఎం జగన్ రెడ్డి మొగ్గు చూపడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పరీక్షలను పిల్లలు బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఓ వైపు ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే.. జగన్ మాత్రం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతూ రాక్షాసానందం పొందుతున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కోసం నిరాహారదీక్ష చేసిన పల్లా శ్రీనివాసరావుకు చెందిన బిల్డింగ్ కూల్చడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనమని తెలిపారు. 

Tags:    

Similar News