కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం : రఘురామకృష్ణరాజు
ఏపీలో కరోనాను నియంత్రించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
ఏపీలో కరోనాను నియంత్రించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. 104 సేవల కోసం ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా ఫోన్ చేసిన తీరే అందుకు నిదర్శనమని చురకలంటించారు. అమరావతి భూములపై సోమవారం నుంచి హైకోర్టు విచారించడం హర్షనీయమన్నారు. కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాల్సిందే అని చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రఘురామకృష్ణరాజు.. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.